Monday 9 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (78)



ఒక్క శ్లోకం చాలు


ఇక నీలాపనిందలు తొలగాలంటే మరొక సూక్ష్మోపాయం ఉంది. మొత్తం శ్యమంతకోపాఖ్యానాన్ని చదవడమూ కష్టమే. కనీసం కథ పై దృష్టి పెట్టండి అందొక్క శ్లోకమైనా చదవండి. ఈ శ్లోకాన్నే జాంబవరి పల్కింది, పిల్లవాణ్ణి జోకొట్టే సందర్భంలో. ఈ శ్లోకాన్ని బట్టి రహస్యాన్ని ఛేదించాడు కృష్ణుడు దీనిని లోగడ పేర్కొన్నాను. అయినా


సింహః ప్రసేనం అవధీత్ సింహో జాంబవతా హతః 

సుకుమారక! మారోదీ: తవ హ్యేష శ్యమంతకః


ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం కథ అంతా మదిలో మెదులుతుంది. ఈ శ్లోకంలో రెండవ సగం, మనలనుద్దేశించినట్లుంది చూడండి. ఓయి పిల్లవాడ! ఏడవకుమని అంది. ఈ సుకుమారక అనే పదం మనకూ అన్వయిస్తుంది. తవ హ్యేష శ్యమంతకః, మణి నీకొరకే. ఇట్లా వినాయకమణి, కృష్ణమణి మనకే, మనకొరకే ఉన్నాయని భావించండి. వాళ్ళ అనుగ్రహం ఉంటే చీటికీ మాటికీ మనం ఏడవాలా?


ప్రత చూడామణి కల్పంలో ప్రతమెట్లా చేయాలో చెప్పబడింది. ఈ శ్లోకాన్ని తప్పక చదవాలని చెప్పింది.


No comments:

Post a Comment