Tuesday 3 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (72)



శివునకు అభిషేకం. విష్ణువునకు ఆలంకారము; వినాయకునకు నైవేద్యము ప్రీతి. ఇతడు పిల్లవాడు కదా! పిల్లలకు తిండిపై ధ్యాస ఉంటుంది. హాని చేస్తుందని తెలియకపోయినా ఏది పడితే దానిని నోట్లో పెట్టుకుంటారు. ఏవో తినుబండారాలిచ్చి వాటిని తీసివేస్తాం. కనుక కడుపునిండా అతనికి నైవేద్యం పెట్టాలి. అవ్వైయార్ అనే గణపతి భక్తురాలు, మొదట ప్రార్థనలో నైవేద్యాల గురించే చెప్పింది.


బ్రహ్మ సలహా ననుసరించి దేవతలందరూ పూజలు చేసారు. సముద్రంలో చంద్రుణ్ణి చూసి నీ తప్పు నీవు తెలుసుకోవాలయ్యా, మా పూజలకంటే ఇది చాలా ముఖ్యం, అపుడు వినాయకుడూ నీమీద జాలి పడతాడని అన్నారు.


కోపంతో ఊగిపోయేవారికి వినయం, దుఃఖం ఒక్కొక్కప్పుడు వివేకాన్ని కల్గిస్తాయి. గుణపాఠం నేర్పుతాయి.


చంద్రుడిన్నాళ్ళూ కుమిలిపోయాడు. దేవతలతో కలిసి ఇవడూ వినాయకుణ్ణి పూజించాడు. 


గణేశుడు సాక్షాత్కరించాడు. శూర్ప కర్ణాలతో అనగా చేటంత చెవులతో వారి విన్నపాన్ని విన్నాడు. వినయ భరితుడై తనను క్షమించుమని చంద్రుడు వేడగా ఉదార హృదయంతో అతణ్ణి క్షమించాడు వినాయకుడు.


శాపాన్ని కాస్త సడలించాడు. “నా నోటి నుండి వచ్చిన వాక్కు వ్యర్ధము కాదు, పూర్తిగా వెనుకకు తీసుకోవడమూ కుదరదు. జ్ఞానం, డబ్బు, అధికారం కలవారి గర్వం పోవాలంటే వారిని ఉపేక్షించడం, వారివైపు కన్నెత్తి చూడకుండా ఉండడమే ఉచితం. ఇతని కథ, అట్టివారికి గుణపాఠంగా ఉండాలి. కనుక ఒక్కరోజున, భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రం ఎవ్వరూ ఇతణ్ణి చూడకూడదు. ఈ మాటను తిరస్కరించినవారు నీలాపనిందకు గురి వలసి వస్తుంది సుమా"!


కనుక సంవత్సరంలో ఒక్కరోజున మాత్రమే ఈ నియమం పెట్టాడు.


No comments:

Post a Comment