Friday 13 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (82)



జయంతుల ప్రత్యేకత


సౌర మాన పంచాంగాన్ని అనుసరించే తమిళులు అడృష్టవంతులంటున్నా కారణమేమంటే వీరికి గోకులాష్టమి (కృష్ణ జయంతి), వినాయక చవితి రెండూ త్రావణ మాసంలో వస్తాయి. ఇతరులకు గోకులాష్టమి త్రావణమాసంలో, వినాయక చవితి భాద్రపదమాసంలో వస్తుంది.


ఈ శ్రావణ మాసంలో దోసకాయలు విస్తారంగా పండుతాయి. ఇది సాత్త్వికాహారం కూడా. వండకుండానే పచ్చివాటిని తినవచ్చు. కృష్ణుడు, వినాయకుడు, బాలలీలలను చూపించే కాలమది. వారి జయంతులలో పచ్చి దోసకాయలు వస్తాయి. అధ్యాత్మికంగా మనం ఎదగడానికీ, అని తగిన కాలం దోసపండ్లను దేవతలకు నివేదించవచ్చు. మనం తినవచ్చు. మనము చల్లగా ఉండాలని వారు దీవిస్తారు.


సారాంశం


ఈ కథలవల్ల గణపతి, చిన్న పిల్లవాడే కాదు అనేక సందర్భాలలో పెద్దల కంటే పెద్దగా ఉంటాడు. ఎవరికంటె? తన తల్లిదండ్రులు, మేనమామ కంటె కూడా.


పరమేశ్వరునకు, లలితాంబకు రామునకు వచ్చిన ఆటంకాలను పోగొట్టినవాడు, సుబ్రహ్మణ్య వివాహానికి తోడ్పడినవాడు, మన అందరి సమస్యలను తీర్చువాడైన గణపతిని, అందరికంటే పెద్దగా ఉన్నానని నటించేవానిని భజిద్దాం.


No comments:

Post a Comment