Monday 16 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (85)

 

ఏనుగు కాని ఏనుగు ముఖం కలవాడు


అతడెంత ఉదార హృదయుడో చెప్పడానికి ఒక్క సంఘటన చెబుతాను. ఎవని దగ్గర కోపం రాదో, ఎవర్ని చూస్తే కోపం పటాపంచలౌతుందో, శాంత మనస్యులౌతారో అట్టివానికి ప్రేమ పూర్వకమైన హృదయం ఉండాలి కదా! దానికి ఉదాహరణ మన గణపతియే. చీమనుండి బ్రహ్మవరకూ ఎవరు ప్రేమిస్తారు? ఆమెయే అమ్మవారు. ఆమె విశ్వజనని. అట్టి తల్లి, అఖిలాండేశ్వరి ఒక సందర్భంలో ఉగ్రరూపం ధరించింది. తమిళనాడులోని జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అట్లా ఉండేది. కలియుగ ప్రజలను చూసి ఉగ్రురాలైందట. ఆమె అమిత శక్తి కలదైనా, లలిత మాదిరిగా అందరినీ ప్రేమించినా ఉగ్రమైన కాళిగా కూడా ఉండగలదు.


ఇట్టి కాళీ రూపం తగ్గించడానికి శంకరులు ఇక్కడకు వెళ్ళారట. వారు పరమేశ్వరుని అవతారం కదా! కనుక ఆయన సమీపించగలరు. ఈ సందర్భంలో గణపతి యొక్క మహత్త్వాన్ని లోకానికి చాటించాలనుకొన్నారు. అందువల్ల అమ్మవారి ముందరగా గణపతిని ప్రతిష్ట చేసారు. అంతే! ఎప్పుడైతే గణపతి వెలిశాడో అమ్మవారి కోపతాపాలు చల్లారాయి. పిల్లవానిపై తల్లికి మమకారం ఉంటుంది కదా.

No comments:

Post a Comment