Wednesday 18 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (87)



వాగీశుడెవడు ?


ఈ పదం, తిరునావుక్కరుసు స్వామికి ఉంది. ఇతడు జైనుడై, జైన మత ప్రవర్తకులలో గొప్పవాడై ధర్మసేనునిగా కీర్తింపబడ్డాడు. అతడు తిరిగి శైవమతంలోకి వచ్చినపుడు పరమేశ్వరుడే అశీరవాణితో "నా వుక్కరసు" అనే బిరుదు నిచ్చాడట. అది సంస్కృతంలో వాగీసుడని అర్ధం. దీని తరువాత తిరుజ్ఞాన సంబంధర్ ఇతణ్ణి అప్పర్ అని సంబోధించాడు. ఈ పేరూ ప్రచారంలో ఉంది. శ్లోకంలోని వాగీసపదం అప్పర్ స్వామిని చెప్పడం లేదు. వాగీశ మరియు దేవతలని ఉంది కదా! అయితే దేవతలలో వాగీశుడెవడు? బ్రహ్మకు, బృహస్పతికి ఈ పేరుంది.


దేవ గురువు బృహస్పతి చాలా బుద్ధిమంతుడు. అందుకే లోకంలో నువ్వేమైనా బృహస్పతివా అనే మాట వచ్చింది. అతడన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు. కనుక అతడు వాగీశుడు. అతడు గీష్పతి కూడా. రెంటికీ ఒకే అర్ధం. ఇతనికి గణపతికి దగ్గర సంబంధం ఉంది. వేదాలలో నున్న బ్రహ్మణస్పతియే పురాణాలలోని విఘ్నేశ్వరుడని పరితోధకులంటారు. గణానాంత్వా అనే మంత్రాన్ని వినాయక ప్రతిష్ఠలో వాడతాం. ఇక్కడ అతడు బ్రహ్మణస్పతియే.


ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గ్రహించవచ్చు. దేవతలు, వినాయకుణ్ణి వారి గురువు, బృహస్పతి ద్వారా తెలుసుకొని అర్చించారనవచ్చు. అనగా దేవగురువు. గణపతిని అర్చించి శిష్యులకిట్లా చేయాలని ఉపదేశించినట్లైంది.

No comments:

Post a Comment