Monday 23 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (92)

ప్రతి పుస్తకానికి ముందు మంగళ శ్లోకం ఉంటుంది కదా. సాధారణంగా గణపతి గురించే ఉంటుంది. ఈ స్తుతిలోనూ న్యాయ శాస్త్రాన్ని రుచి చూపించారు శాస్త్రిగారు.


అప్యన్యామరమారి రాధ యిషతాం యత్నాద పంకేరుహ

ద్వంద్వారాధనమంతరాయ హతయే కార్యం త్వవశ్యం విదు:


తద్దేతోవిధినీతివిత్తు భజతే దేవం యమేకం పరం

సర్వార్థ ప్రతిపాదనైక చతురోద్యైమాతురోజవ్యాత్ సనః 


అనగా గణపతి కంటే మిగిలిన దేవతలను పూజించేవారు కూడా ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతినే ముందు పూజించాలి. తాము పూజించే ఇతర దేవతల అనుగ్రహం కావాలన్నా ముందితనినే పూజించాలి. ఈ 'తతః హేతు' న్యాయాన్ని బట్టి ఇతడే ప్రథమ దేవత అవుతాడు. అట్టి విఘ్నేశ్వరుడు మా ప్రయత్నాలను ఫలించేటట్లుగా అనుగ్రహించుగాక.


తతఃహీతు న్యాయం


హేతువంటే కారణం. విద్యుత్తున్న తీగను ముట్టుకుంటే ప్రమాదం కదా. ఆ తీగ హేతువైంది. హేతువునకు విరుద్ధం అహేతువు. ఏ కారణం లేకుండా దేనినీ ఆపేక్షించకుండా భగవానుని పట్ల చూపు భక్తి అహైతుకీభక్తి అని అంటారు. అట్టి జ్ఞానియైన భక్తుడు, నిర్గుణ స్వరూపం రుచి చూసినవాడే.

No comments:

Post a Comment