Saturday 21 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (90)



మన్నారు గుడికి చెందిన రాజు శాస్త్రిగారనే మహావిద్వాంసుడుండేవాడు. గొప్ప శివభక్తుడు. అనుష్ఠానపరుడు. ఆయన గురుకులం నడిపి ఎందరినో విద్వాంసులుగా తీర్చి దిద్దాడు. ఆయన అసలైన కులపతి. ఆయన గురించి ఎవరైనా చెప్పవలసి వచ్చినపుడు వారి పేరుతో చెప్పేవారు కాదు. మన్నారు గుడి పెరియవ అనేవారు. ఆ మాటకు మన్నారు గుడి పెద్దవారని అర్ధం. నా మాదిరిగా మఠాధిపతి కాదు. నన్నట్లా గౌరవంతో పిలుస్తున్నారు. అయన సన్న్యాసి కాదు, గృహస్థే. 


సుమారు వంద సంవత్సరాలు బ్రతికారు. 20 వ శతాబ్దం మొదటివరకూ ఉన్నారు. అంత విద్వాంసుడైనా గొప్ప వినయవంతుడు. 1887 లో తెల్లదొరల ప్రభుత్వం వారికి మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చింది. "ఇది పెద్ద విద్వాంసులకిచ్చేది. నాకు అర్హత లేదని" వినయంతో అన్నారు. ఆ బిరుదును ఢిల్లీ వెళ్ళి తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ గారే బిరుదును, బహుమతిని తీసుకొని వచ్చి యిచ్చారు. ఇతర విద్వాంసులు వీరితో వాగ్వాదం చేసినా సున్నితంగా సమాధానం చెప్పేవారు. తిరువిసైనల్లూర్ లో రామ సుబ్బశాస్త్రీ గారనే మహా మహోపాధ్యాలుండేవారు. ఆయన స్మార్తుడైనా అద్వైతాన్ని, సన్న్యాసాన్ని, శివభక్తిని గూర్చి నిందావాక్యాలు వ్రాయగా వ్యక్తిగతంగా వారిని దూషించకుండా ప్రతి మాటను శాస్త్రోక్తంగా దుర్జనకోటినిరాసం అనే గ్రంథంలో రాజుశాస్త్రిగారు ఖండించారు.     


వారు వ్రాసిన అనేక రచనలలో న్యాయేందు శేఖరగ్రంథము గొప్పది. అది తర్కవేదాంతాల సంగమం. దానినే న్యాయశాస్త్రమంటారు.

No comments:

Post a Comment