Thursday 12 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (81)



మణి లేకపోవడం వల్ల కఱువు రావడం, మరల భాగ్యం రావడం, అంతా నాటకంలో భాగమే. అసలు ద్వారకలో కృష్ణుడుండగా మణితో నిమిత్తం లేకుండా భాగ్యం ఉండదా? కఱువు, నాటకంలో ఒక భాగం. తరువాత భాగ్యం రావడమూ అంతే. మణిని ఆధారంగా తీసుకొని ఈ నాటకం ఆడించాడు, ఆ జగన్నాటక సూత్రధారి.


అతడు చెప్పినట్లే అక్రూరుని దగ్గరే మణియుంది. ప్రజలు సత్యం తెలుసుకొన్నారు. లెంపలేసుకున్నారు. కృష్ణుణ్ణి నుతించారు. 


బలరాముడూ విదేహ రాజ్యం నుండి తిరిగి వచ్చాడు. ఈ మొత్తం కథను వినిపించారు. కృష్ణుణ్ణి అనవసరంగా శంకించానని బాధపడ్డాడు బలరాముడు.


“మీదేమీ తప్పులేదు. నేను చవితి చంద్రుణ్ణి చూడడమే కొంప ముంచింది. ఇదీ బాగానే ఉంది. దీనివల్ల వినాయకుని గొప్పదనం వెల్లడైంది కదా అని కృష్ణుడన్నాడు. (అపార సంపద ఒక వ్యక్తి చేతిలో ఉంటే ఎన్ని అనర్ధాలు వస్తాయో గమనించారా? ప్రజలందరికీ చెందవలసిన విలువైన సంపద ప్రభుత్వాధీనంలో ఉందాలని ఈ కథ వెల్లడించడం లేదా? సంపద కలకాలం ఉండాలంటే శారీరిక, మానసిక శుచి తప్పక ఉండాలని బోధించడం లేదా? - అనువక్త)


No comments:

Post a Comment