Friday 6 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (75)

 


కృష్ణుడు - చంద్రుడు


కృష్ణునికి సంబంధించిన గోకులాష్టమి పూజలోనూ చంద్రునకు అర్ఘ్యం ఉంటుంది కూడా. ఇట్లా కృష్ణుడు చంద్రుణ్ణి కూడా పూజించాలనే నియమాన్ని పెట్టియుంటాడు, విఘ్నేశ్వరుడు దయ చూపించినట్లుగా.


మరొక కథ ఇతనిలో సంబంధం ఉంది. రాముడు సూర్యవంశంలో పుట్టి రవికుల తిలకుడని, ఇనుకుల తిలకుడని పేరు గడించాడు. అంటే సూర్యునకు ప్రాధాన్యం ఇచ్చి చంద్రునకు అప్రాధాన్యం ఉన్నట్లే కదా. రాముని దగ్గరకు వెళ్ళి నన్నెట్లా విస్మరించావయ్యా అని విలపించాడు. బాధపడకయ్యా, నా పేరు చివర నీ పేరు నుంచుకొని ఇక రామచంద్రుడని పిలువబడుతానులే, అన్నాడట. అంతేకాదు, మరొక అవతారంలో చంద్రవంశంలోనే పుడతానని అన్నాడట. అందువల్ల కృష్ణుడు, చంద్రవంశంలో అవతరించాడు. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటట్లు చేసాడు. కనుక కృష్ణాష్టమి రోజున చంద్రునకు అర్ఘ్యం ఇయ్యాలి.

నింద పోగొట్టడానికి వరం


మరొకవిధంగానూ సత్కరించాడు గణపతి. సంకటహర చతుర్థినాడు తనతో చంద్రునికి పూజ చేయాలని చెప్పడమే గాక ఆ తిథికి ముందున్న తిథినాడు చంద్రుణ్ణి చూస్తే మంచిదని కూడా అన్నాడు. అమావాస్య తరువాత వచ్చే పా డ్యమినాడు చంద్రుణ్ణి చూస్తే చవితినాడు చూసిన దోషం తొలగిపోతుందనే నియమాన్ని ఏర్పాటు చేసాడు.


ఆ చవితి ముందున్న తదియనాడు చూడాలి. ఈ రోజే ఈశ్వరుడు అమ్మవారు, గణపతి కూడా చంద్రరేఖను నెత్తిపై ధరించారు. అమావాస్య తరువాత వచ్చిన పాడ్యమిలో చంద్రుడు మసక మసకగా కన్పిస్తాడు. విదియనాడు కన్పిస్తాడు. దానిని చంద్రదర్శనమని పంచాంగాలలోనూ ఉంటుంది. ఆ తదియనాడు చూడడాన్ని మరిచిపోయాం. లోకంలో చవితినాడు చూస్తే బాధలు పడవలసి వస్తుందనే నానుడి మాత్రం ఏర్పడింది. అమావాస్య నుండి మొదలు పెడితే నాల్గవ తిథి, తదియ వస్తోంది. (అట్లా లెక్కబెట్టి చూడడం లేదేమో!)


No comments:

Post a Comment