Monday 8 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (195)



గణేశుని వల్ల సంస్కృతి యొక్క విస్తృతి


శైవతేవారంలో, వైష్ణవ దివ్య ప్రబంధాలలో దివ్యక్షేత్రాలు పేర్కొనబడ్డాయని చెప్పాను. అంతేకాదు, కావేరీ తీరంలో శైవ వైష్ణవ మహాత్ములతో సంబంధం లేని క్షేత్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. తమిళనాడు, దివ్యదేశంగా పేర్కొనబడింది. ఇది భక్తికి నిలయం. దానికంతటికీ కావేరీ తీరమే కారణం. ఆ కావేరిని ప్రవహింపజేసినవాడు గణపతి. ఈ దేశంలో అన్ని కళలకు దైవత్వానికి సంబంధం గట్టిగా ఉంది. దీనికంతకూ గణపతియే కారణమని మరొక్కసారి నొక్కి చెబుతున్నా.


ఎక్కువ ఆలయాలున్నవాడు


మిగతా ప్రాంతాలలో ఉన్న మొత్తం గణపతి ఆలయాలు ఒక్క తమిళనాడులో ఉన్న సంఖ్యతో సరిపోవు. మహారాష్ట్ర ప్రాంతం, గాణపత్యానికి నెలవే. అయినా తమిళనాడులో ఉన్న సంఖ్యకంటే తక్కువగానే అలయాలుంటాయి.

No comments:

Post a Comment