Wednesday 24 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (211)



విగ్రహారాధన - జ్ఞానము


ఒక అరటి పళ్ల అత్తాన్ని నా ముందుంచారు. ఇది పసుపు పచ్చగా ఉందని నేనంటే అవునని మీరు అంటారు. ఇందుకు సందేహం లేదు. ఇది ఎరుపుగా ఉందనిఒక పండును చూపిస్తూ అన్నాననుకోండి. ఎర్రగా ఉండంటారేమిటని ప్రశ్నిస్తారు. కాదని అంటారు వెంటనే. నేను దీని రంగు ఫలానా అని చెప్పకుండా ఈ అరటిపండు ఎర్రగా ఉందని కాసేపు ఊహించండని అన్నాననుకోండి. నేనన్నది కాదన్నా ఎర్రదానిగా ఉన్నట్లు ఊహిస్తారు. మనస్సును సమాధానపరచుకొంటే అట్లా భావించవచ్చు.


పూజకూడా అట్టిదే. ఉపాసనా మార్గాలు అనేకం ఉన్నాయి. పరమేశ్వరుడిట్లా ఉంటాడని, ఈ గుణాలతో ఉంటాడని భావించండని ఈ ప్రతిమలను దేవతలని భావించండని అంటారు. అట్లాగే అరటిపండు పసుపే. పరమాత్మ స్వభావమట్టిదే. అతడు నిర్గుణుడని అంటే ధ్యానం చేయడం సామాన్యులకు అలవికాని పని. మనకెందుకులే, మనకు చిక్కదులే అని నిరాదరణ చూపిస్తారు. అరటిపండు ఎర్రగా ఉందని చెప్పినపుడు మాత్రం, పరమాత్మ ఈ విగ్రహంలో ఉన్నాడనిపుడు ముందుగా మనసు కాదంటుంది. కనబడేది రాయికదా! దేవుడంటారేమిటని శంకిస్తారు. కాని దీనిని పరమాత్మగా భావించండని అనినపుడు, పచ్చని పండుసు ఎర్రగా ఉందని భావించండని అనినట్లు భావించడం మొదలుపెడతారు. ఏది ఎరుపో మనస్సు గుర్తించగలదు. కాని పరమాత్మ స్వభావం మనకు అర్థం కాదు. కనుక వ్రిగహాన్ని విగ్రహంగానే చూస్తే దాని మీద మనస్సు లగ్నం కాదు. తెలిసిన వాటితో మనస్సు బంధింపబడి ఉంటుంది. ఆ విగ్రహం స్త్రీ మూర్తిగా అందంగా మలచబడగా అమ్మవారిట్లా వచ్చిందని ఊహించండని అంటే మనస్సు అంగీకరిస్తుంది లగ్నమౌతుంది కూడా.


No comments:

Post a Comment