Tuesday 9 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (196)

 


వినాయకుడు - తమిళ భాష


సంస్కృతిలో భాషకు అధిక ప్రాధాన్యం ఉంది. భాషవల్లనే అనేక గ్రంథాలు కథలు, కవిత్వం, నీతి శాస్త్రం, జ్ఞానం మొదలైన విషయాలను చెప్పేవి వెలువడతాయి. తమిళ భాషలో గణపతికి అధిక ప్రాధాన్యం ఉందని, ఏ చిన్న మాటను వ్రాయడానికి మొదలు పెట్టినా గణపతి చిహ్నాన్ని తమిళ భాషాక్షరంతో సూచించి వ్రాస్తారని లోగడ పేర్కొన్నాను. ఇట్టి మంగలారంభం ఎక్కడా కనబడదు. అట్టి అక్షరం తమిళభాష చేసుకొన్న అదృష్టం.


తిరప్పుగళ్లో, అరుణగిరినాధుడు అనే సత్పురుషుడు, తమిళ సాహిత్యానికి వ్యాకరణానికి, సంగీత నాటకాలకు వినాయకుడే మొదలని, ఇతడు మేరు పర్వతంపై అట్టి గ్రంథాలు వ్రాసేడని పేర్కొన్నాడు. అంటే వ్యాసుని భారతానికి వ్రాయసగానిగా ఉండడానికి ముందే తమిళ సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని అందించాడని ఊహించవచ్చు.


అవ్వైయార్ ఉపదేశం లేకుండా, ఈ ప్రాంతంలో విద్యాభ్యాసమే లేదు. వినాయకుని పాదాలు పట్టుకుంటే మంచి హృదయం, మంచి మాట, మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయని ఏ శ్రమ లేకుండా ఇతణ్ణి పూజించవచ్చని అవ్వైయార్ తన పాటలలో పాడింది. ఉపవాసాలు, హఠయోగం వంటివి అక్కర్లేదని చెప్పింది. కొన్ని పువ్వులుంచినా చాలని అతడు పగడపు రంగులో ఉంటాడని, ఆ పిల్లవానికి తల్లి పోలిక యని పాడింది. కామాక్షి రంగు ఎరుపే!

No comments:

Post a Comment