Wednesday 10 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (197)



మంచి మనస్సు, మాట ఇచ్చే దేవుడు


భగవానుడెన్నో రకాల ప్రాణివర్గాలను సృష్టించాడు. ఒక్క మానవునకే మాట్లాడే శక్తి ఉంది. మాట్లాడే శక్తినిచ్చేవాడు గణపయ్యయని అవ్వైయార్ కీర్తించింది. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం మానవులకే ఉంది. అట్టి జ్ఞానాన్ని, మంచి మనస్సు, మంచి మార్గాన్ని ప్రసాదించేవాడూ గణపయ్యయని గట్టిగా చెప్పింది.


మన మనస్సు కరగాలన్నా, మంచి మాటలు మాట్లాడాలన్నా సన్మార్గమే అనుసరించాలి కదా. ఏది మంచి మార్గమో అవ్వైయార్ ఒక పుస్తకంలో చెప్పింది. పాలు, తేనె వంటి నాల్గింటిని నీకు అర్పిస్తామని, మూడింటిని అనగా తమిళంలోని మూడు శాఖలను ప్రసాదించుమని అడిగినట్లు లోగడ పేర్కొన్నాను.


మంచి మార్గాన్ని సద్గతి యని అంటారు. అంటే కేవలం మంచి జీవితాన్ని గడపడం కాదు. ఆ సద్గతి చివర వస్తుంది. అదే మోక్షమార్గమని అంటారు పెద్దలు.


పురుషార్థాలు ధర్మంతో మొదలిడి మోక్ష పదంతో ముగుస్తాయి. అట్టిది అవ్వైయార్ జీవితంలో స్పష్టంగా గోచరించింది. గణపతి తన తుండంతో ఈమె నెత్తి కైలాసంలో ఉంచాడు కదా!  


No comments:

Post a Comment