Tuesday 23 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (210)



ఈ సందర్భంలో నీలకంఠుల శ్లోక తాత్పర్యం వినండి.


పెరియపురాణంలో ఒక కథలో స్వామి, ఒక కూలి వానిగా వచ్చి ఒక మధుర పదార్థం తినడానికి నెత్తిమీద గంప పెట్టుకొని మట్టిని మోసే సందర్భమది. ఈ కూలీ సరిగా పనిచేయడం లేదని ఆనాటి పాండ్య రాజు ఒక కొరడా దెబ్బవేస్తాడు. ఆ దెబ్బ అందరికీ తగిలింది. కొట్టిన రాజునకు కూడా. అందువల్ల స్వామి, అన్ని ప్రాణులలోనూ ఉన్నట్లే కదా! అపుడు కవి ఇట్లా చమత్కరించాడు. దెబ్బ తినేటపుడు నీవు శివాద్వైతాన్ని చూపించావయ్యా! (అందరూ ఒకటే అన్ని). కాని మధుర పదార్ధం తినేటపుడు నీవొక్కడివే తిన్నావు ఆ తింటున్నపుడు, అందరూ తింటున్నట్లు చేయలేక పోయావు. ఇట్లా ఉండడం బాగుందా అని ప్రశ్నించాడు.


దీని నుండి బ్రహ్మముగా ఆంతరంగా ఉన్నా ఈశ్వరునిగా ప్రకటింపబడుతూ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడని తేలింది. అతనివి పంచకృత్యాలు, సృష్టి స్థితి, సంహారములు. ఇవి భ్రాంతితో కూడిన ప్రపంచానికి సంబంధించినవి. మిగిలినవి రెండున్నాయి. మాయ చేసే కృత్యం తిరోధానం. ఈ మాయ నుండి విడుదల చేయడం అనుగ్రహం. అద్వైత స్థితిని చేరుకోవడానికి ఇట్టి అనుగ్రహమే లభిస్తుంది. ఆ అనుగ్రహం కోసమే తపశ్చర్య. అట్లా చేయాలని అనిపించడమూ అతని అనుగ్రహమే. అట్టి నమ్మకంతో, ప్రేమతో కొలవడమే భక్తి.


No comments:

Post a Comment