Wednesday 31 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (218)


ఆలయాలు- కళలతో పెనవేసి కొన్న ఆనాటి వాతావరణాన్ని మెగస్థనీసు ప్రశంసించాడు. ప్రజలను కళల ద్వారా ఉత్తేజితుల్ని, సంస్కారవంతుల్ని చేసిన ఆనాటి వాతావరణాన్ని చూసి ముగ్ధుడైపోయాడు.


కనుక ప్రజలకు మానసిక తృప్తిని, ధార్మిక సంస్కారాన్ని ఇచ్చే ఆ నాటక కళల సంస్కృతి పునరుజ్జీవింపబడాలి. ప్రజలు, ప్రభుత్వమూ ప్రోత్సహించాలి.


ఇక ఆలయం కూడా ఆగమ శాస్త్ర నియమాలను తు, చ, తప్పక పాటిస్తూ మంత్ర పఠనం వల్ల పవిత్రం చేస్తూ ఉండగా, అందు పురాణ ప్రవచనాదులు జరుపబడుతూ ఉంటే పూర్వవైభవం వస్తుంది. అర్చకులకు, శిల్పులకు, కళాకారులకు తగిన భృతి ఉన్నపుడు మాత్రమే అన్నీ సక్రమంగా జరుగుతాయి. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది.


No comments:

Post a Comment