Monday 15 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (202)

కనుక అన్నిటిని సృష్టించిన వానికే ఇదంతా చెందుతుంది. అందువల్ల అతడు ఉడైయార్. స్వామికి అన్నీ చెందాయి కనుక అన్నిటిని అతనికి విడిచిపెడితే మన బాధలేముంటాయి? నెత్తిపై బరువుంటుందా?


నేను, నేనని తెగ బాధపడిపోతున్నాం. ఈ నేను, నేను - వాడిదే అనే భావం కలిగినపుడు బాధలెక్కడ ఉంటాయి? ప్రేమ, ద్వేషాలకు తావులేదని గ్రహించినపుడు బాధలులేవు. అఖండ శాంతి. భగవానుని స్వామియని ఎప్పుడైతే సంబోధిస్తున్నామో వెంటనే ఏదీ నాది కాదు, నీదే అనే భావన తొంగి చూస్తుంది. అతడన్నింటిని పంచి పెట్టడానికి అతనికే అర్హత వస్తుంది. కనుక ఇట్టి గుర్తింపు మనలో ఉన్నపుడు భక్తి రాణిస్తుంది.


ప్రకృతిలో ఈశ్వర తత్వం


ప్రకృతిలో అనేక శక్తులు వెదజల్లబడియున్నాయి. ఒకటా? రెండా? అనేకం. వీటన్నింటిని మించిన శక్తి ఒకటుంది.


మనకు దేహశక్తి యుండడం వల్ల వస్తువుల నెత్తగల్గుతున్నాం. మనకంటె ఎద్దు, అధికమైన బరువు మోస్తుంది. దానికంటే ఒంటె; దానికంటే ఏనుగు ఎక్కువ బరువును మోస్తుంది.


ఇక మానసిక శక్తిని చూడండి. చెట్టుకంటే పురుగునకు ఎక్కువ మానసిక శక్తి ఉంటుంది. దానికంటే చీమకు, దానికంటే పశువునకు, అంతకంటే మానవునకు అట్టి శక్తి అధికంగా ఉంది.


అన్ని శక్తులకు ఒకటి మూలాధారమని గుర్తిస్తాం. అతడే స్వామి. 


No comments:

Post a Comment