Monday 22 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (209)



శివుని దక్షిణామూర్తి స్వరూపము, బ్రహ్మమును తెలుపుతుంది. ఆ దశలో అతనికి క్రియలేదు. అది కేవలమూ నిశ్శబ్దము. పరమశివుడెన్నెన్ని పనులు చేయడం లేదు? చిదంబరంలో నృత్యం చేస్తూ ఉంటాడు. దారుకావనంలో భిక్షాటన మూర్తిగా ఉంటాడు. అందరినీ ఆకర్షిస్తాడు. దక్షయజ్ఞంలో సూర్యుని దంతాలనే ఊడగొట్టాడు.


లోలోపల అణగియుండి, నిర్వికారుడై బాహ్యంగా అనేక కృత్యాలు నిర్వహిస్తూ ఉన్నట్లుగా కనబడతాడు.


ప్రపంచమనే సరస్సులో సాధారణ జనులీదుతూ ఉంటారు. జ్ఞానులందులకు విరుద్ధము. తీరాన్ని దాటి యుంటారు. ఈ ఇద్దరి మధ్య ఒడ్డు. సరస్సులో మునిగిన వానికి బాహ్య తీరాలు కనబడవు. జ్ఞాని, ఈ సరస్సును చూడడు. భగవానుడు ఒడ్డు వంటివాడు. సరస్సును చూస్తాడు, అవతలి తీరాన్ని చూస్తాడు. ప్రపంచం, విలయమయిందని భావించే జ్ఞానినీ చూస్తాడు. సరస్సులో మునిగితేలే వానిని చూస్తాడు. ఆ జ్ఞానిని పిలిచి సరస్సులో మునిగే వానిని ఉద్దరించుమని చెబుతాడు. ఒడ్డునకు చేర్చుమని ఆదేశిస్తాడు.


తానన్నిటా వ్యాపించానని భగవానునికి తెలుసు. అయినా తనకంటే భిన్నుడని భావించే సామాన్యులకు భిన్నంగానే ఉన్నట్లు తోపింప చేస్తాడు. అది ఒక వినోదం. 


No comments:

Post a Comment