Sunday 19 December 2021

శ్రీ హనుమద్భాగవతము (107)



అక్షయకుమారుడు మరణించాడని వినగానే రావణుడు చింతాక్రాంతుడయ్యాడు, ఎట్లో తన మనస్సును ఊరడించుకున్నాడు. ప్రజ్వలితమవుతున్న్న రోషాగ్నిచే దగ్ధుడవుతూ, మహాకాయుడైన రావణుడు తానే బయలు దేరగా స్వయముగా ఆంజనేయుని బంధించుటకు ఇంద్రజిత్తు తన తండ్రిని వారించి ఇలా పలికాడు. “పితృ దేవా! నేనుండగా నీ వేల దుఃఖించెదవు? ఒక్క క్షణములో నేను వానరుని బంధించి నీయెదుట ఉంచగలను.


ఇంద్రజిత్తు వానరేశ్వరుడైన హనుమంతునితో యుద్ధం ఒనరించుటకు బయలు దేరగా రావణుడు కుమారుని సావధానపఱస్తూ ఇలా పలికాడు.”


శ్లో || న మారుతస్యాస్తి గతిప్రమాణం | 

న చాగ్నికల్పః కరణేన హంతుమ్ | 


(వాల్మీకి. రా. 5.48-11) 


కుమారా! ఆ వానరుని గమనమునకు లేదా శక్తికి ప్రమాణము గోచరించుటలేదు (అనగా అవధులు లేవు) అగ్ని సమాన తేజస్వియైన ఆ వానరుని ఏ సాధనము చేతనైనా నిర్జించుట సాధ్యముకాదు.


కావున నీవు నీ ప్రతిపక్షమున నున్న వాడిని నీతో సమానుడైన పరాక్రమము కలవాడని తెలుసుకుని ధనుర్భాణముల యొక్క దివ్యప్రభావమును జ్ఞప్తి యందుంచుకొని (దివ్యాస్త్రములను స్మరిస్తూ) రణరంగంలో ప్రవేశించు. నీపరాక్రమాన్ని చూపు.


తన తండ్రి పలికిన వచనాలను ఆలకించి వీరవరుడైన మేఘనాథుడు దశకంఠునకు ప్రదక్షణములను ఆచరించి ఘోర యుద్ధము చేయ సంకల్పించినవాడై తన అద్భుతరథాన్ని అధిరోహించాడు. 


No comments:

Post a Comment