Thursday 10 February 2022

శ్రీ హనుమద్భాగవతము (156)



తానిచ్చిన మాటను మరువని హరతనయుడు గోవర్ధనముతో 'పర్వతేశ్వరా! నీవు చింతింపకుము. భక్త ప్రాణ ధనుడైన నా స్వామిని ప్రార్థించెదను. ఆయన తప్పక నేనిచ్చిన మాటను సత్యమొనరించి నిన్ను అనుగ్రహింపగలడు.' పవనాత్మజుని ఆ శ్వాసనమునకు గోవర్ధనగిరి ప్రసన్నుడై భగవంతుని ఆగమనము కొఱకై నిరీక్షింపసాగెను. శ్రీ ఆంజనేయుడు శ్రీ రామచంద్రుని చెంతకు వెళ్ళి ఆయన చరణారవిందములకు నమస్కరించి వినీతుడై స్తుతించెను. దయామయుడు, సర్వజ్ఞుడునైన ప్రభువు నీ అభీష్టమేమని ప్రశ్నింప, శ్రీ ఆంజనేయుడిట్లు వినమ్రుడై విన్నవించెను. “భక్త జనవల్లభా! నేను శ్రీగోవర్ధనగిరికి నీ దర్శనమును గల్గించెదనని, పతితపావనములైన నీ చరణారవిందముల సంస్పర్శాసౌభాగ్యము నొసంగెదనని బాస చేసితిని; కాని వానరవీరులు నీయా దేమును నాకు అందింపగ నే నేనా పర్వతేశ్వరుని ప్రజభూమిపై నుంచితిని. అతడు ఖిన్నుడై నన్ను ప్రార్థింపగా నీదర్శనమును, స్పర్శను తప్పక కల్గి చె దనని మరల బాస చేసితిని.”


సర్వాంతర్యామి, భక్తవత్సలుడునైన శ్రీరామచంద్రుడు శ్రీహనుమంతునితో ఇట్లు పల్కెను. “ప్రియభక్తుడా! మాట నా మాటయే యని తెలిసికొనుము. శ్రీ గోవర్ధన పర్వతమునకు నా అనుగ్రహము తప్పక ప్రాప్తించును. ఆతడు మయూరమకుటంతో మురళీ వినోదియైన నా శ్రీకృష్ణ రూపాన్ని సదా ఆరాధించును, కావున ద్వాపరయుగములో నేను శ్రీకృష్ణుడనై అవతరించెదను. ఆ అవతారములో గోవర్ధనగిరిని అనుగ్రహించెదను. ప్రజబాలకులతో కలసినవాడనై గోవర్థనగిరిపై విహరించుచు మధుర ఫలములను ఆరగించెదను, గోవులను గోవర్ధనముపై పాలించెదను; అంతియే కాదు, ఆ పర్వత శ్రేష్ఠుని సప్తదినములపర్యంతము నా చిటికెన వేలిపై ధరించెదను. ఈ విషయములనన్నింటిని అగిరి రాజునకు తెల్పుము.”


కృపామూర్తియైన శ్రీ రామచంద్రునకు "జయ"మనుచు శ్రీపవనకుమారుడు ఆనందముతో అంతరిక్షమునకు ఎగిరి గోవర్ధనమును చేరెను. "గిరిరాజా! నీవు ధన్యుడవు. భక్త పరాధీనుడై ప్రభువు నీ కోరికను మన్నించెదనను మాట నొసంగెను. ద్వాపరయుగములో నీ ఆరాధ్యదైవమైన శ్రీకృష్ణునిగా అవతరించి ఆయన నిన్ను గ్రహించును. నీపై బాల్యలీలలను ఒనరించును. నీచే సమర్పింపబడు పత్రపుష్పఫలంతోయములను తాను అనుభవించును. సప్తదినముల పర్యంతము నిన్నా భక్త వత్సలుడు తన చిటికెన వేలిపై ధరింపగలడు. ఆహా! ఏమి నీ అదృష్టము అని ఆంజనేయుడు పలికెను.


No comments:

Post a Comment