Thursday 24 February 2022

శ్రీ హనుమద్భాగవతము (170)



నీవు నా కమండలములో గల జలములను త్రాగుమని ముని పల్కగా ఆంజనేయుడు ఈ జలము తనకు చాలదని జలాశయమును చూపింపుడని పల్కెను. అది మునివర్యుని ముఖము మలినమయ్యెను. ఆంజనేయుని కార్యము ఆలస్యమగునట్లు అతడిట్లు పల్కెను. “కపీంద్రా! నాకంతయు అవగతమే. తపోబలముచే త్రికాలములను నేను గ్రహింపగలను. శ్రీరాముడు లంకాధిపతియైన రావణునితో యుద్ధం ఒనరించుచుండెను. ఇంద్రజిత్తుచే ప్రయోగించిన అమోఘమైన శక్తిచే లక్ష్మణుడు మూర్ఛితుడయ్యెను. కాని పవనకుమారా ! నీవిక ఆందోళనము చెందవలసిన పనిలేదు. లక్ష్మణుకు అచేతనుడై కుశలముగా ఉన్నాడు, కావున నీవిక వేగిరపడక మా ఆశ్రమమందు గల మధురఫలములను ఆరగించి, జలములను త్రాగి విశ్రమింపుము. తదనంతరం మరలిపోవచ్చును. 


ఆంజనేయుడు పల్కెను. మునిసత్తమా! దయతో మీరు జలాశయమునకు మార్గమును చెప్పుడు. శ్రీరామకార్యములో ఒక్క క్షణమైనను ఆలస్యమగుట నేను సహింపలేదు.


శ్రీరఘునాయకుని కార్యములో విఘ్నములను కలిగించుటకై రావణునిచే పంపబడిన కాలనేమి అనే రాక్షసుడే ఆ ముని వేషమును ధరించెను. వాని కమండలమునందు గల విషము వ్యర్థమయ్యెను. ముని రూపధారియైన ఆ మాయావి మఱల ఆంజనేయునితో ఇట్లు పల్కెను. "అపురూపమైనా ఆ ఓషధులు సామాన్యులకు దృష్టి గోచరములు గావు. అవి లుప్తములగును; కాని నేను నీకు సహాయమొనరించెదను. వెంటనే నీవు జలాశయములో జలములు త్రాగి స్నానమొనరించి రమ్మ. నీకు నేనొక మంత్రమును ఉపదేశించెదను. ఆ మంత్రప్రభావముచే ఓషధులు నీకు గోచరింపగలవు. అదిగో జలాశయము. నేత్రములను మూసుకుని జలములను త్రాగుము.”


No comments:

Post a Comment