Monday 31 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 237 వ భాగం



పృథ్వీరుణ్ణి శృంగేరీ పీఠాధిపతిగా చేసారని జర్మనీకి చెందిన పుస్తకాల పట్టికలో "శృంగేరీ పృథ్వీ ధరాచార్య" అని ఉంది. ఇతణ్ణి పృథ్వీధర భారతియని కూడా అంటారు. శృంగేరిలోనున్నవారికి, భారతీయని చివర ఉంటుంది. తీర్ధ సంప్రదాయం వారూ ఇందున్నారు.


దిగ్విజయం భారతీయ సమైక్యం


ఆరువేల మంది శిష్యులతో ఆసేతు హిమాచలం పర్యటించి 56 దేశాలలో ఉన్న విమతాలను ఖండించి వేదధర్మాన్ని ప్రతిష్టించారు. ఎవరినీ హింసించి కాదు. వారు జయశాలి.


72 మతాలున్నాయంటే ప్రజలు 72 వర్గాలుగా చీలిపోయారన్నమాట. వీరినందరినీ సనాతన ధర్మంవైపు మళ్ళించారు. దానిని పూర్తిగా నిర్వహించినవారు శంకరులు. ఇదంతా ఏ రాజుల యొక్క అండదండలు లేకుండా నిర్వర్తించగలిగారు. దీనినందరూ ప్రశంసిస్తున్నారు. ఆధునిక భావాలు కలిగిన నెహ్రూగారు. ఆయన వ్రాసిన Glimpses of world History' లో "I have spoken about Kings and Royal Dynasties. But more than all these Kings and Emperors this young man from the south did more for national life. What is surprising in this is that without givivng room to emotions, intellectually he attracted even the ordinary people and not Brahmins or scholars"


నెహ్రూగారు చెప్పినది ముమ్మాటికీ సత్యమే. ప్రేమతో బుద్ధుడు ప్రజలను ఆకట్టుకుంటే బుద్ధితో వీరాపని చెప్పారు. తత్త్వం గురించి చెప్పేటపుడు భావావేశాలకు లోనుగాక శ్రుతి, యుక్తి, అనుభవాన్ని జోడించి ఒప్పించారు. ఆలయ పునరుద్ధరణ, పూజా పద్ధతులు, భక్తి స్తోత్రాల రచన - ఇదంతా ప్రేమతోనే చేసారు. ఇక్కడ భావాలకు ప్రాధాన్యం. భక్త్యావేశంతోనే వ్రాసేరు.


No comments:

Post a Comment