Friday 2 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (42)



కుమార స్వామికి సాయం


తల్లిదండ్రులే ఇతని విజయావకాశానికి దారి చూసినపుడు ఇతని తమ్ముడు ఇతని సాయం కోరకుండా ఉంటాడా? ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికి పండునిస్తామని తల్లిదండ్రులనడం అనే కథ మీకు తెలిసిందే. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యుడు గెలవలేక విరక్తిని చెందాదు. తల్లిదండ్రులు ఓదార్చారు.


సుబ్రహ్మణ్యుని అవతార ఉద్దేశ్యం శూర పద్ముణ్ణి ఓడించడమే. ఇక వల్లిని వివాహం చేసుకునే సందర్భంలో వేటగాని వేషం వేయవలసి వచ్చింది.  

ఇతణ్ణి ఆమె గుర్తుపట్ట లేకపోయింది. తన నిజరూపాన్ని ప్రకటించి ప్రేమను పొందాలనుకుంటాడు. ఈ సందర్భంలో అన్నగారి గొప్పదనాన్ని చాటాలనుకున్నాడు. ఏ పని చేసినా విఘ్న నాయకుణ్ణి కొలవాలనే సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంలో మహాగణపతిని ధ్యానించాడు.


వినాయకుడు పిచ్చి యెత్తిన ఏనుగులా మారి, వల్లిని భయపెట్టాడు. వేటగాని రూపంలో ఉన్న కుమారస్వామిని భయం వల్ల వల్ల కౌగిలించుకొనవలసి వచ్చింది. అతడు కుమారస్వామియనే ఎఱుక లేకుండా జరిగింది. ఇక వేషాన్ని తొలగించుకొని నిజరూపంలో కుమారస్వామి ఆమె ముందు సాక్షాత్కరించారు. వల్లిని ఆశ్చర్యంలో ముంచివేశాడు.


తరువాత వల్లీ వివాహం, కుమారస్వామితో జరిగింది. ఇలా వీరిద్దరి ప్రేమ వివాహానికి కారకుడు గణపతి.


అరుణగిరినాథుడు, విఘ్నేశ్వర స్తుతి సూచించే తిరుప్పుగళలోని త్రిపురాసుర సంహారం - వల్లీ వివాహంలో ఇతని సహాయాన్ని నుతించాడు.

No comments:

Post a Comment