Monday 26 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (65)



అయితే అనవసరమైన భయాందోళనలున్న అక్రూరునకు కృష్ణునిపై అచంచల భక్తి విశ్వాసాలున్నాయి. ద్వారకను విడిచి కాశీయాత్రకు బయలుదేరాడు.


కాశీలో అడుగు పెట్టగానే సద్బుద్ధి కలిగింది. స్వార్థం కోసం మణిని వాడుకోవాలని భావించలేదు. ఎప్పటి మాదిరిగానే ఎనిమిది బారువుల బంగారాన్ని మణి ఇస్తూ ఉండేది. స్వార్ధం కోసం వాడక దానితో ఆలయాలను కట్టించాడు. దైవకైంకర్యమే చేసాడు.


ఇతడు సదాచార సంపన్నుడని మణికి తెలుసు. ఇది బంగారాన్ని ఇయ్యడమే కాదు. చుట్టుపక్కల రోగాలు లేకుండా కూడా చేసింది. క~ఎరు కాటకాలు లేవు. పుష్కలంగా పాడిపంటలు, అంతా సుఖశాంతులలే.


నిందకు కారణం - నేరాలు


ఇట్లా అనేక సంఘటనలచే కృష్ణుని చిత్తం కకావికలమైంది. "ఈ మణివల్ల ఇన్ని కష్టాలా? ఇది ప్రసేనుణ్ణి, సత్రాజిత్తును, శతధన్వుడిని మ్రింగివేసిందే! ఇప్పుడు నా సోదరుడే నన్ను శంకిస్తున్నాడు! దేశంవిడిచి పెట్టి వెళ్ళాడు.

No comments:

Post a Comment