Tuesday 27 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (67)

అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం నిర్ధారించబడతాయి. కనుక వినాయక చవితి, భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశినాడే. తమిళులకు మాత్రం భాద్రపదంలో గాని లేదా శ్రావణంలో గానీ రావచ్చు. ఒకొక్కసారి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించడానికి అమావాస్య తరువాత నాల్గు రోజులు పట్టవచ్చు. అటువంటప్పుడు తమిళులకు వినాయక చవితి శ్రావణమాసంలోనే వస్తుంది. ఎందుకనగా సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినపుడు మాత్రమే వారికి భాద్రపద మాసం మొదలవుతుంది. అదే విధంగా శ్రీరామనవమి కూడా చాంద్రమానాన్ని అనుసరించే వారికి చైత్రమాసంలోనూ తమిళులకు ఫాల్గుణ లేదా చైత్ర మాసాలలోనూ వస్తూ ఉంటుంది. అట్లా గోకులాష్టమి కూడా. 


నారదుడిక్కడ చెపుతున్నది చాంద్రమాన భాద్రపద శుక్ల చతుర్థి గురించి. ఇదే వినాయక చవితి. కృష్ణుడట్టి ఒక్క చవితినాడు చంద్రున్ని చూసాడు. 


ఆనాడు చంద్రుణ్ణి చూసావని నారదుడన్నాడు. ఎప్పుడది? ప్రసేనునితో అడవికి వెళ్ళడం, విడిపోవడం జరిగిననాడే. ప్రొద్దు పోయిందని ఆకాశం వంక చూసాడు కృష్ణుడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇట్లా చూడడం వల్ల విఘ్నేశ్వరుని శాపానికి గురి కావలసి వచ్చిందని అన్నాడు. 


ఆనాడు చూస్తే దురదృష్టం ఎందుకు వెంటాడుతుందని కృష్ణుడు ప్రశ్నించాడు. నారదుడు కథను చెప్పడం మొదలు పెట్టాడు.


No comments:

Post a Comment