Friday 16 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (56)



నిందలపాలైన కృష్ణుడు లోపలకు ప్రవేశించి నిందను పోగొట్టుకోవాలి కదా! అతణ్ణి ఆ అందగత్తె చూడగా ఆమెలో ప్రేమ, భయమూ ఒక్కమాటే కలిగాయి. అతినికేమైనా ఆపద కల్గుతుందేమో అని భయపడింది.


మణి-యువతి

ఆమె ఎవ్వరో కాదు, జాంబవంతుని కూతురు, జాంబవతియే. ఈ గుహలో ఎవ్వరూ ప్రవేశించలేరు. ఈ అందగాడు ప్రవేశించాడు. కోపంతో తన తండ్రి ఇతనికేమైనా హాని తలపెడతాడేమోనని కంగారు పడింది.

జాంబవంతుడు నిద్రపోతున్నాడని, నిమ్మదిగా నీవెవ్వరివని అడిగింది. భగవానుడు జవాబు చెప్పాడు.

ఇది మా నాన్న వింటే కోప్పడతాడు. నీవు మణిని తీసుకొని వెడతానంటే అగ్గిమీద గుగ్గిలం పోతాడు. చడీ చప్పుడు కాకుండా వెంటనే తీసుకొని పో అని తొందర పెట్టింది.

అతడు వెళ్ళిపోవాలని ఆమెకూ లేదు. అట్లాగే కృష్ణునిపై మోజుపడి రుక్మిణి, ఒక బ్రాహ్మణుని దూతగా పంపి వచ్చి నన్ను తీసుకొని పొమ్మని చెప్పింది. కాని ఈ స్త్రీ మణిపట్ల మమకారం చంపుకొని, ప్రేమించిన వానికి ప్రాణహాని జరుగుతుందని వెళ్ళిపొమ్మంది.

No comments:

Post a Comment