Thursday 15 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (55)


ఆ గుహలో వెలుగు కనబడింది. అది మణి ప్రభావమే, మధ్యలో ఒక ఊయెలలో పిల్లవాడు నిద్రిస్తున్నాడు. ఆ మణి, ఊయెలపై వ్రేళ్ళాడుతూ ఉంది. పక్కన ఒక అందమైన స్త్రీ ఉంది. 

పురాణాలలోని జంతువులు మనుష్య భాషలో మాట్లాడుతాయి. స్త్రీలు కూడా అందంగా ఉన్నట్లు వర్ణనలుంటాయి. జంతు దశనుండి మానవాకారపు దళ ఈ స్త్రీలలోనూ చూడవచ్చని డార్విన్ సిద్ధాంతం వారంటే అనవచ్చు. 

ఒక పాట వినబడింది. ఆ పాట ఏదో వట్టి జోలపాట కాదు. ఆ పాటలో భగవానుడు వెదకడానికి వస్తున్నాడని ఉంది. 

సింహః ప్రసేనం అవధీత్ సింహో జాంబవంతా హతః

సుకుమారక! మారోదీ: తవ హ్యేష శ్యమంతకః

ఈ శ్లోకం భాగవతంలో లేదు. ఇది విష్ణుపురాణంలోనూ, స్కాంద పురాణంలోనూ ఉంది. అనగా సింహం, ప్రసేనుట్ణి చంపింది. జాంబవంతునిచే సింహం చంపబడింది. ఓ సుకుమార శిశూ! ఇక ఏడవవద్దు. ఈ మణి నీ కొరకే అని.


భగవానుడేమనుకొన్నాడో ఈమెకెట్లా తెలిసింది?  


No comments:

Post a Comment