Thursday 22 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (62)



మరల విజయం - మరీ నింద


కృష్ణుడు తిరిగి వచ్చి దుఃఖించే భార్యను చూసాడు. మామగారి మరణం కలత పెట్టింది. కక్షను పెంచింది. చిరంజీవియైన జాంబవంతుడు ఓడించిన కృష్ణుడు తనను క్షమిస్తాడా అని శతధన్వుడు పలాయనం చిత్తగించాడు. ద్వారకనుండి వెళ్లిపోయాడు. 


పోతూ పోతూ మణిని అక్రూరుని దగ్గర ఉంచాడు. ఆ మణిని కృష్ణుని పాదాల దగ్గర నుంచితే క్షమించి యుండేవాడు కదా! ఆమలిన మనస్సు అట్లా చేయిస్తుందా? ఈ పరుగెత్తడం కృష్ణుని పరాక్రమానికి దోహదపడింది. తన దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? కష్టాలు వస్తాయని విన్నాడు. చూసాడు కాబట్టి ఈ కష్టాలను అక్రూరునకు బదిలీ చేసాడన్నమాట. మొండి పట్టుదల, శత్రుత్వం, దుష్టబుద్ధి, ఇట్టి పనులు చేయిస్తుంది. అక్రూరుడు మంచివాడు కనుక అతని దగ్గర ఉంటే క్షేమమని భావించాడు. పైగా అతడు కృష్ణుడు భక్తుడు.


పరుగెత్తే శతధన్వుణ్ణి చూసి నిజంగా కోపపడలేదు కృష్ణుడు. అతడు ధర్మ సంస్థాపకుడు కదా! కోప పడినట్లు నటించాడు. బలరామునితో కలిసి ఈ రథంపై వెళ్ళి శతధన్వుడు పట్టుకోబోయాడు.


శతధన్వుని గుట్టం అలిసిపోయి చనిపోయింది. ఇక పిక్కబలం చూపించాడు. బలరాముడు రథంలోనే ఉండిపోయాడు. ఇద్దరూ కలిసి ఒకణ్ణి ఓడించకూడదనే నియమాన్ని పాటించాడు. 


No comments:

Post a Comment