Thursday 29 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (69)



చంద్రగర్వ భంగం


మూషిక వాహనం ఎక్కి మహాగణపతి మూడు భువనాలు తిరుగుతున్న సమయంలో ఒకమాటు చంద్రలోకానికి వెళ్ళాడు. శశివర్ణుడు శశి (చంద్రుడు) లోకానికి వెళ్ళావన్నమాట. పిల్లలందరికీ చంద్రుడంటే ఇష్టం కదా!


తానందగాడని చంద్రునకు గర్వం హెచ్చు. భగవంతుని ముఖాన్నే చంద్రునితో పోలుస్తారు కవులు. ఇందువల్ల గర్వం నెత్తికెక్కింది. ఈ స్తుతులకు అలవాటు పడినవానికి మిగతావారందరూ తక్కువగా కనిపిస్తారు. అందమైన పిల్లవాని రూపంలో ఉన్న వినాయకుడు, ఇతని దృష్టిలో ఎందుకూ పనికి రానివాడు.


ప్రేమ, శాంతి, వివేకంగల గజముఖం, విశాలమైన చెవులు, బొజ్జ, చిన్ని కాళ్ళు - వీటిని మరీ మరీ చూడాలనిపిస్తుంది కదా! ఎవరితోనైనా పోల్చగలమా అని భావిస్తాం. మన భావాలకు విరుద్ధంగా ఈ పొట్టేమిటి? ఈ తుండమేమిటి? చేటంత చెవులేమిటి? కడవ వంటి బొజ్జ ఏమిటి? కుఱచ కాళ్ళేమిటి? అని నిరసన భావంతో చూసాడు చంద్రుడు. ఏవి భక్తికి ప్రీతిపాత్రంగా ఉంటాయో అవే ద్వేషించేవారికి  హేయవస్తువులు. చంద్రుడీ రూపాన్ని చూసి పకాలున నవ్వాడు.

No comments:

Post a Comment