Sunday 4 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (44)

సంస్కృతంలో డేంఠి రాజా గణపతి లేదా డుంఢి గణపతి పదాన్ని తుండి అంటారు తమిళులు. ఆ గణపతి కాశిలో ప్రసిద్ధుడు. దానికి తగ్గట్టుగానే తోండి గణపతి ఉన్నాడిక్కడ. ఇక్కడా రాముడు, వినాయకుణ్ణి అర్చించాడట. ఇది వేదారణ్యం. ఉప్పూర్ మధ్యలో ఉంటాడు. అనగా వేదారణ్యం నుండి సముద్ర తీరానికి వెళ్ళేదారిలో ఉంటాడు. ఇక్కడినుండే రాముడు, సేతువును కట్టడానికి మొదలు పెట్టాడని అంటారు. కనుక ఇక్కడి వినాయకుడు పూజించాడు. రాముణ్ణి ఆశీర్వదించి శ్రమ తగ్గడం కోసం ఇంకా కాస్త ముందుకు వెళ్ళి కట్టుమన్నాడట. లంకను సులువుగా చేరవచ్చని సలహా ఇచ్చాడట.


తొండి వినాయకుడి గుడికి విమానాదులేమీ వుండవు. అట్టాహాసాలంటే ఇష్టపడలేదట. ఎందుకంటే తన మామయైన రాముడు ఎండనక వానయనక తిరుగుతూ ఉంటే తనకెందుకు పై ఆచ్ఛాదనలని ఆలయ నిర్మాణానికి అనుమతించి ఉండకపోవచ్చు. శంకరుల గణేశ పంచరత్నం, ఈ గణపతిని గురించే యుంటుంది. ఈశ్వర సుతుడైన వినాయకుణ్ణి అర్చించడం వల్లనే విజయాన్ని సాధించి రాముడు, విజయ రాఘవుడయ్యాడు. అంతే కాదు, భార్యతో కలిసి సీతాముడయ్యాడు. తిరిగి వచ్చేటప్పుడు రామలింగం గానున్న ఈశ్వరుణ్ణి పూజించాడు.


లోగడ శంకరుల పాలరాతి విగ్రహాన్ని ఒక వాహనంలో తరలించడాన్ని ప్రస్తావించాను. అచిరుపాక్కంలో 108 కొబ్బరికాయలు కొట్టినట్లు ఉప్పూర్ లోనూ కొట్టాం. మొదటి ప్రాంతంలో ఈశ్వరునికి వచ్చిన కష్టాన్ని తొలగించాడు. రెండవ ప్రదేశంలో రాముని పూజలందుకున్నాడు. జ్యోతిర్లింగమైన రామేశ్వరం, రాముని దయవల్ల అందరికీ పుణ్యక్షేత్రమైంది. రామ, ఈశ్వరులతో ఇతనికి ఉన్న సంబంధాన్ని ఈ విధంగా పాలరాతి విగ్రహ యాత్రలో శంకరులందించారు.

No comments:

Post a Comment