Saturday 24 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (64)



బలరాముని ఆగ్రహం ఒక పట్టాన చల్లారేది కాదు. ఎవరి మాటలునూ వినదు. నిన్ను వెదకడమేమిటి? టక్కుటమార విద్యలన్నీ నీకు తెలుసు, పచ్చి మోసగాడివని నిందించి నీ దగ్గర ఒక్కక్షణం ఉండనని బలరాముడు ద్వారకకు తిరిగి రాక విదేహ రాజ్యానికి వెళ్ళిపోయాడు.


ద్వారకకు తిరిగి వచ్చాడు కృష్ణుడు. ఇట్లా అవమానాలూ, నిందలూ ఇంకా ఎక్కువయ్యాయి. మణి పట్ల లోభంతో అన్నగారినే తరిమేసాడని లోకులన్నారు. లోకులు పలు కాకులు కదా! 


ఇతరుల గుణాలను శ్లాఘించడానికి బదులు లోపాలనే ఎత్తి చూపిస్తూ ఉంటాం. మనం కూడా పత్రికలను చదువుతూ ఇష్టమైన నాయకుల్ని పొగుడుతూ ప్రతిపక్షాలను నిందిస్తూ ఉంటాం కదా. ఇట్టి మానవ ప్రవృత్తి యొక్క వివరాలు పురాణాలలో పుష్కలంగా ఉన్నాయి.


అక్రూరుడు - మణి


కృష్ణుడి రాక అక్రూరునకు దడ పుట్టింది. ఎప్పుడూ కృష్ణునితో కలిసిమెలిసి ఉండేవాడేమో. ఇప్పుడు దూరదూరంగా ఉంటున్నాడు. తేలు కుట్టిన దొంగలా, ద్వారకనుండి చల్లగా జారుకున్నాడు. శంకరులే మన్నారు? అర్థమనర్థం భావయ నిత్యం అని అనలేదా? డబ్బెంత పని చేస్తోందో చూసారా? ఎన్ని అనర్థాలను తీసుకొని వస్తుందో!


No comments:

Post a Comment