Monday 5 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (45)

 

కృష్ణావతారంలో కృష్ణుడు వినాయకుడిని పూజించడం విస్తారంగా ఉంది.


గణనాథుడు - కృష్ణుని పూజలందుకొనుట శ్యమంతకోపాఖ్యానము


ఈ కథ భాగవతంలో ఉంది. ఆఖ్యానం అంటే కథ. ఉపాఖ్యానం, ప్రక్క కథ సూచిస్తుంది. ఇతిహాసంలోని గాని, పురాణాలలో గాని ప్రధాన కథ సాగుతూ ఉంటే చిన్న చిన్న కథలు ఉపాఖ్యానాలుగా వస్తాయి. ఇందు కొన్ని ప్రధాన కథతో సంబంధం కలిగి యుండవు. భారతంలో నలోపాఖ్యానం అట్టిది. కొన్ని కథలు, ప్రధాన కథతో సంబంధం కలిగి యుంటాయి. వాటిని విడిగా చూపలేం.


భాగవతంలో అట్టి సంబంధం ఉన్న కథ శ్యమంతకోపాఖ్యానం అట్టిది. ఈ కథ అంతా మణిచుట్టూ తిరుగుతూ ఉంటుంది. కృష్ణునిపై వేసిన అభాండాలు, వాటిని అతడెట్లా దాటాడో వివరిస్తుంది.


ఇదే కథ, విష్ణుపురాణంలోనూ ఉంది; కొద్ది తేడాలతో. అట్లాగే స్కాందంలో నందికేశ్వర సనత్కుమార సంవాద రూపంలో ఉంటుంది. స్కాందంలోని ఈ కథకు వినాయకునకు గల సంబంధాన్ని తెలుపుతుంది. నందికేశ్వరుడు, సనత్కుమారునితో చెప్పిన కథనే ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అక్కడక్కడ భాగవతాన్ని, విష్ణుపురాణాన్ని పేర్కొంటాను. 


No comments:

Post a Comment