Monday 19 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (59)



మణి-వివాహము


స్వామీ! నేను నీ ఆధీనంలో ఉన్నాను. నీది నీకీయడం సబబు. ఈ మణితో ఈ కన్యామణిని కూడా స్వీకరించవయ్యా! అనగా జాంబవతిని కూడా స్వీకరించాడు. జాంబవతి కోరిక కూడా నెరవేరింది. రెంటినీ గ్రహించాడు నల్లనయ్య. ద్వారకకు ఆ రెంటితో వచ్చాడు.


మణి తన దగ్గర ఉంచుకోవడానికి తగిన అర్హతలన్నీ అతనికున్నాయి. కారణం! జాంబవంతుణ్ణి జయించి ఆ మణిని తీసుకున్నాడు. ఆ జాంబవంతుడు సింహాన్ని ఓడించాడు. అదేమో ప్రసేనుణ్ణి చంపి మణిని పొందింది. ఆ విధంగా తనకు సంపూర్ణమైన హక్కు ఉంది. అయినా ఈ భౌతిక సంపదకై ఆశ పడతాడా? తనపై వేసిన నింద పోగొట్టుకోవడానికే ఈ తతంగం అంతా జరిగింది. కనుక మణిని సత్రాజిత్తునకిచ్చాడు. తపస్సు చేసి దాన్ని సంపాదించాడు కదా సత్రాజిత్తు.


అతడు సంతోషంతో మణిని స్వీకరించాడు. కాని ఏదో అపరాధం చేసాననే చింత, మనస్సును పీకుతోంది. సత్రాజిత్తునకు ఒక్కగానొక్క కుమార్తె సత్యభామ. ఆమె భూదేవి అవతారం. రుక్మిణి లక్ష్మి యొక్క అవతారం.


జాంబవంతుని మాదిరిగానే సత్యభామను, మణిని కృష్ణునకే అర్పించాడు సత్రాజిత్తు. భగవానుడు గోపాలరత్నం కదా! కనుక సత్యభామను మాత్రమే స్వీకరించాడు. మణిని స్వీకరించలేదు. మణి, నీ ఆధీనంలో ఉంటుంది, నీ కుమార్తె నా ఆధీనంలో ఉంటుందని అన్నాడు. సత్రాజిత్తు ఒక్కతే కుమార్తె కనుక అతని సంపదంతా ఈ దంపతులకే చెందుతుంది.

అయితే కథ ఇంకా ముగియలేదు, ఇంత వరకు మన గణపతి ప్రస్తావన ఏది?

తన జీవితకాలం ఈ మణిని అనుభవిద్దాం. తరువాత వారికే చెందుతుందని భావించాడు సత్రాజిత్తు. ఇది చివరకు ఇతని జీవితాన్నే బలిగొంది. అనేక కష్టాలు. చూద్దాం.

No comments:

Post a Comment