Saturday 10 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (50)


కృష్ణుని సందేహించడమే కాదు, అతనినుండి భయం కల్గుతుందనీ సత్రాజిత్తు భావించాడు. కృష్ణుడు చిన్నతనంలోనే చాణూరుడు, ముష్టికుడనే ప్రధాన మల్లురను, కంసుణ్ణి చంపాడు. 17 సార్లు జరాసంధుణ్ణి తరిమి వేసాడు. ఆపైన జిత్తులమారి కూడా. అతనితో శత్రుత్వం వహిస్తే నేనెట్లా నిలబడగలనని సందేహించాడు సత్రాజిత్తు.


ఒక మూల శ్యమంతకమణిని రాజుకు ఈయలేడు, దానిని ఉంచుకొనే సామర్థ్యమూ లేని పరిస్థితి. భౌతిక సంపదలు మనిషిని ఎన్ని ముప్పుతిప్పలు పెడతాయో గమనించారా? 


ప్రస్తుతానికి ఆ మణిని తన సోదరుడైన ప్రసేనజిత్తు అందజేసి ప్రశాంతంగా ఉన్నాడు. ఇతనికంటే తెలివైనవాడు, బలవంతుడు ప్రసేనజిత్తు.


ఇతడు దీనిని ధరించి వేటకు బయలుదేరాడు. కృష్ణునితో వెళ్ళినట్లు స్కాందం చెప్పింది. నేను చెప్పేది భాగవతాన్ని, విష్ణుపురాణాన్ని అనుసరించేది. 


దీనిని ధరించి ఎట్లా ఉండాలని నియమం చెప్పాడు సూర్యుడు? శారీరకంగా మానసికంగా పవిత్రునిగా ఉండాలి కదా! (కాలకృత్యాలు తీర్చుకున్నాడు కానీ) అతడరణ్యంలో ఉండడం వల్ల కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి నీరు దొరకలేదు. ఆ సమయంలో సింహం వచ్చి ఇతణ్ణి చంపివేసింది. సింహానికి ఈ మణిని చూస్తే ఏదో ఆకర్షణ కలిగింది. దానిని పట్టుకుని పోతూ ఉంటే చీకటితో నున్న అడవి, పట్టపగలులా వెలిగిపోతోంది. అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టింది.

No comments:

Post a Comment