Tuesday 20 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (60)

 


స్త్రీల శత్రుత్వం


వివాహానంతరం కుంతితో పాండవులందరూ లక్క గృహంలో బూడిదపాలయ్యారనే వార్తను విన్నాడు కృష్ణుడు. వారు బ్రతికి యున్నారు తెలిసి కూడా లోక మర్యాదను పాటించి ధృతరాష్ట్రుడి పరామర్శ చేయడానికి హస్తినాపురానికి వెళ్ళాడు. అవతార పురుషుడు అట్టి మర్యాదలను పాటించాడు. 


ఇతని నిర్గమనం, సత్యభామకు కష్టాలను తెచ్చిపెట్టింది. 


యాదవులలో శతధన్వుడనే దుర్మార్గుడున్నాడు. యాదవ వంశంలో కృతవర్ముడు, అక్రూరుడనే ముఖ్యులూ ఉన్నారు. వీరిద్దరు కృష్ణునకు దాసోహం అనేవారే. అక్రూరుడు, పరమ భాగవతోత్తముడు. అతడే బలరామకృష్ణులను బృందావనం నుండి మధురకు తీసుకొని వచ్చాడు, ఈ పై ముగ్గురూ సత్యభామనే వివాహమాడాలని ఎవరికి వారే నిశ్చయించుకున్నారు. ఎవరడిగితే వారికే తన అమ్మాయిని ఇస్తానన్నాడు సత్రాజిత్తు. కాస్త సమయం కావాలన్నాడు. కాలం గడుపుతున్నాడు. తర్వాత శ్యమంతక మణి రావడం వల్ల భగవానునికి తన కుమార్తెనిచ్చాడు.


ఈ సంఘటన చిచ్చుపెట్టింది. మానవమనః ప్రవృత్తులు ఎంత మోసపూరితంగా ఉంటాయో వివరించింది పురాణం. ఈ ముగ్గురూ సత్రాజిత్తు పై కక్ష కట్టారు. కృష్ణునిపై నింద వేసినపుడు అక్రూరుడు, కృతవర్మలిద్దరూ కృష్ణుణ్ణి వెనకేసుకొని వచ్చారు. ఇది సత్రాజిత్తు నాకు కోపం తెప్పించింది. ఇప్పుడు కథ తారుమారైంది. వీరిద్దరి మనస్ఫూ మారిపోయింది. కృష్ణుని పట్ల భక్తి దూరమైంది. స్త్రీ పట్ల కామం, శత్రుత్వం ఇవన్నీ అహంకారం యొక్క వికారాలే కదా! ఇక భక్తికి తావెక్కడ? అని ఈ కథ యొక్క సారాంశం.

No comments:

Post a Comment