Friday 2 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (39)



యుగాలు మారినా- తరాలు దొర్లినా రామాయణ కాలంనాటి సాంఘిక జీవన స్థితిగతులు నేటి సమాజానికి దర్పణాలుగా నిలవడం ఆశ్చర్యకరం. రామాయణాన్ని అనుదినం మననం చేసి అందలి జ్ఞాన విజ్ఞానాలను "నీటికొలది తామర సుమ్మీ" అన్నట్లు ఆగాధ జలనిధిలోని అనంత రత్నాలను అందగలిగినంతవరకు ఆందుకుని జీవన ధన్యత నందుటకు ప్రయత్నించవలెను.


చూడండి. ఈ సన్నివేశంలో పవన తనయుడు సీతాన్వేషణ నిరంతర పరిశ్రమ, కఠోర దీక్ష, నిస్వార్థ సేవాభావం, నిర్మల హృదయం, ఏకాగ్ర చిత్తంతో చేసినా ఫలితం శూన్యమైంది. ఎంతటివానికైనా ఆ పరిస్థితులలో జీవితం మీదనే విరక్తి కలుగుతుంది. మరి అటువంటప్పుడు కలిగే మనోవికారం ఆత్మహత్య. ఆత్మహత్య మహా దోషం. ఆ భావం అసలు మనసులోకి రానీయ రాదు. వచ్చిందా వివేకం లోపిస్తుంది సామాన్యులకు.


ఇది యీనాడు మనం నిత్యం చూస్తున్నదే. ఈనాటి సమాజం చూస్తే ఏమున్నది గర్వకారణం? ఏ పేపరు చూచినా ప్రేమ విఫలమైతే - ఆత్మహత్య. పెద్దలు బుద్ధి చెబితే - ఆత్మహత్య. పరీక్షా ఫలితాలలో తన నెంబరు కనబడకపోతే ఆత్మహత్యే! ఇంటిలోని వారు తన మాట కాదంటే- ఆత్మహత్య. ఇలా ప్రతి సమస్యకు తేలిక మార్గం ఆత్మహత్యే. అంటే అన్నింటికీ పరిష్కార మార్గం ఆత్మహత్యేనన్న మాట. ఇదీ నేటి సమాజ పరిస్థితి.


No comments:

Post a Comment