Thursday 22 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (58)



"దురలస్య బలం రాజా" అన్నది సూక్తి. దుర్బలులంటే స్త్రీ, బాల, వృద్ధులు, ఆనాధలూనూ. వీరికి అండదండలందించ వలసిన రాజు నీతిదప్పి పట్టపగలే నట్టివీధిని పట్టబోరే జార చోరులు అన్నటుల ప్రవర్తించరాదు. ఆహంకార, దౌర్జన్యాలకు రాజుగా చోటీయరాదు. చెల్లియుండియు సైరణ సేయగలగాలి. ఎంతటివారైన ధర్మం తప్పిన అధోగతే. ఇవన్నీ హనుమంతుని దౌత్యం మనకు నేర్పుతుంది.


ఆగ్రహ జ్వాల - లంకా దహనం .


వధే తస్య సమాజ్ఞ స్తే రావణే న దురాత్మనా 


హనుమత్సందేశం విన్న రావణుడు సలసల కాగే నీటిపై చల్లని నీరు చల్లిన మంటలెలా పైకి లేస్తాయో- అలా ఒక్క సారి ప్రచండాగ్నివలె మండిపడి 'దూత' అను మాట మరచి, అతనిని పట్టి చంపండని ఆజ్ఞాపించగా


సాధుర్వా యది వాసాధుః పరై రేష సమర్పితః 

బ్రువన్ పరార్థం పరవాన్న దూతో వధ మర్హతి. 


రాక్షసరాజా! దూత మంచివాడుగానీ, చెడ్డవాడుగానీ దూత అయినందువలన చంపరాదు. అతడాడు మాటలు తన ప్రభువువి కాని తనవి కావు. దూత అస్వతంత్రుడు. అందతని దోషమే మున్నది? తాన లోక విరుద్ధమూ రాజనీతి వ్యతిరేకము అగు పని మనము చేయుట పాడి కాదు. మనకప్రియముల నొనరించి నందున బోడితల చేయుటో- కొరడాతో కొట్టుటో- అంగహీనుని చేయుటో వంటి శిక్షలు కలవు. వానిని చేయవచ్చుననగా రావ ణుడు


"కప్లీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం

తదన్య దీప్యతా శీఘ్రం తేన దగ్గేన గచ్ఛతు". 


కోతులకు తోక అలంకారం ఆ తోకను వెంటనే తగల బెట్టుడి. నలుదిక్కుల తిప్పి పరాభవించి పంపండి. తోక లేని ఇతడు తన జాతివారిలో పరిహాసపాత్రుడు అవుతాడు".  


No comments:

Post a Comment