Sunday 11 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (47)



కార్యసాధనకై తగ్గిన ఆల్పుఁడగునా?


శ్రవణ సుభగాలైన ఆ మాటలకు ఆనందాశ్చర్యాలతో తన వృత్తాంతం వివరించి జానకి - మీకూ రామలక్ష్మణులకు పరిచయం ఎట్లు కలిగిందన్న అనుమానం వెలిబుచ్చగా .. ఆంజనేయుడు ఆమె సందేహాలను తీరుస్తూ - "అమ్మా! నేను రామదూతినై నీ దగ్గరకు వచ్చాను." ఉన్నాడు లెప్స రాఘవుడు. లక్ష్మణుడును కుశలమే. 'త్వాంచ కుశల మబ్రవీత్' నీ క్షేమం అడగమన్నారు. నాపై నీకు నమ్మకము కలుగుటకై - దేవీ! రామనామాంకిత అంగుళీయకాన్ని ఇచ్చారు. ఇదిగో చూడు తల్లీ! అని ఉంగరం యీగా తీసుకుని 'జానకీ ముదితా భవత్' సంతోషించింది. విశ్వాసం కలిగింది. "హనుమా! నాకున్న గడువు ఇక రెండు మాసములే" అని గద్గదకంఠయై పలికింది.


అమ్మా! నిన్నీ స్థితిలో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నది. సందేహించకు తల్లీ!! నా వీపుపై కూర్చుంటే నిన్ను క్షణంలో రాముని దగ్గరకు చేరుస్తాను. "అస్మాద్దుఃఖా దుపారోహ మమ పృష్ఠం అనిందతే" అవలీలగా శతయోజన విస్తీర్ణ సాగరం దాటి వచ్చాను. అనాయాసంగా తిరిగి వెళ్ళగలను. అంతేకాదు రావణ సహితంగా లంకను పెళ్ళగించి మరీ తీసుకు వెళ్ళగలను. రాక్షసులు నన్ను వెంబడిస్తారని భయపడవలదు. వేగాన్ని అందుకునే శక్తి వారికి లేదు". నా గమన వేగాన్ని అందుకనే శక్తి వారికి లేదు." 


ఆ మాటల కానందించినా జనక నందినికి అనుమానం మాత్రం వీడలేదు.


హనుమన్ దూరమధ్వానం కథం మాం ఓడుమిచ్చసి 

తదేవ ఖలుతే మన్యే కపిత్వం హరి యూధప


హనుమా! అంగుష్ఠమాత్రమైన లేవే! నన్ను అంతదూరం ఎలా మోస్తావు. నీ మాటలు నీ కవిత్వాన్ని చూపుతున్నాయి.

No comments:

Post a Comment