Tuesday 25 July 2023

అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు. ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు. నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు. రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.

 


అడవిలో కంద మూలాలు సేకరిస్తున్న పరశురాముడికి అపశకునాలు కనిపించాయి. మనస్సు కీడును శంకించింది. త్వరత్వరగా పర్ణశాలకు వచ్చాడు. జరిగిన ఘోరం కళ్ళారాచూసాడు. తండ్రిని తలుచుకొని దుఃఖపడ్డాడు. ఇటువంటి మరణం సంక్రమించినందుకు బాధ పడ్డాడు. కన్నతల్లిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. చిట్టి పొట్టి తమ్ముళ్ళు భయభ్రాంతులై వొణికి పోతూ బిక్కుబిక్కుమని తన వైపే చూస్తున్నారు. అందరిని ఒక్కసారిగా పట్టుకొని బావురుమన్నాడు పరశురాముడు. అమ్మా! నా కారణంగానే ఈ దారుణం జరిగింది. నేనే - నేనే బాధ్యణ్ణి అనుకుంటూ తలబాదుకుంటూ తల్లి పాదాల మీద పడ్డాడు. కుమిలిపోతున్న తల్లితో సమానంగా రోదించాడు. రెండు క్షణాల్లో తెప్పరిల్లాడు. చివాలున లేచి నిలబడ్డాడు. ఎర్రబారిన కళ్ళల్లో నీళ్ళు నిండుకొని విప్పారి ఒక్కక్షణంలో ప్రళయ కాలరుద్రుడిగా మారిపోయాడు. అశక్తుడిలా నేను నిలపించడం ఏమిటి? కర్తవ్యాన్ని విస్మరించడం ఏమిటి అని తనకు తాను ప్రబోధించుకున్నాడు.


ధనుర్భాణాలూ గండ్రగొడ్డలీ ధరించాడు. సోదరులూ ఆశ్రమవాసులు వారిస్తున్నా లెక్క చెయ్య లేదు. ఎవరి మాటా వినిపించుకోలేదు. రాజధాని వైపు సుడి గాలిలా దూసుకు వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని కొడుకులందర్ని ఊచకోత కోసేసాడు. అంతే వేగంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వస్తూనే ఆశ్రమవాసులందరూ వినేట్లుగా జలదభీషణంగా భీకర ప్రతిజ్ఞ చేసాడు. ఈ భూమిని క్షత్రియ శూన్యం చేస్తాను. ఒక్క సారికాదు ఇరవై ఒక్క మార్లు చేస్తాను. ఇందులో అసత్యం గానీ అధర్మం గానీ లేదు - అని ఒక్క పెట్టున దిక్కులు పిక్కటిల్లేలాగా భూగోళంలోని క్షత్రియులందరికీ టముకు వేసినట్లుగా ధనుష్టంకారం చేసాడు.


నాయనా! నీ ప్రతిజ్ఞలూ ప్రతీకారాలు తరువాత. ముందు నీ తండ్రికి భక్తితో అంత్యక్రియలు జరిపించు. మాకు జరగవలసిన సంస్కారాల సంగతి చూడు. నన్నొక వైపూ మీ తండ్రి శరీరం మరొక వైపూ కావిడికి ఎత్తుకుని బయలుదేరు - ఆగు - ఆగు - అనే మాట వినిపించిన చోట దింపు. సర్వ శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు చెప్పినట్లు మాకిద్దరకూ ఉచిత సంస్కారములు జరిపించు.


రేణుకాదేవి ఆజ్ఞతో ఆ వీరావేశం నుంచి స్పృహలోకి వచ్చాడు పరశురాముడు. తల్లి చెప్పినట్లే ఇద్దరినీ కావిడకు ఎత్తుకొని తమ కావ్యకుబ్జాశ్రమం నుంచి బయలుదేరాడు. అతడితో పాటు ఆశ్రమవాసులైన మహర్షులూ బయలుదేరారు. వడివడిగా నడుచుకుంటూ తీర్థాలూ, తాపసాశ్రమాలూ, వనాలూ, అరణ్యాలూ, పర్వతాలూ, నదులూ అన్నీ దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. సహ్య పర్వతం చేరుకున్నారు. ఆమలకీ తరుమండితమై దత్తాత్రేయుల వారి ఆశ్రమం కనిపించింది. అదే సమయానికి అశరీరవాణి వినిపించింది.

No comments:

Post a Comment