Monday 31 July 2023

శ్రీదత్త పురాణము (213)

 


కృష్ణా మలకం కథ


ఒకానొక సందర్భంలో ఏక వీరా దేని ఆజ్ఞ మేరకు చతుర్ముఖుడు విష్ణు సందర్శన కాంక్షతో క్షీర సముద్రానికి బయలు దేరాడు. కానీ అక్కడ విష్ణుమూర్తి కనిపించలేదు. ఎంత వెదికినా ఎంతసేపున్నా శేష శాయి దర్శనమే కాలేదు. ఏమిటి ఈ వింత చెప్మా- అని భయ సందేహ పరాభవాది భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అక్కడ ఒక అమలకీ తరువు (ఉసిరిక) కనిపించింది. అది విద్యుత్కాంతులు విరజిమ్ముతున్న కృష్ణామలకీ తరువు. దాన్ని తీసుకొని తిరిగి వచ్చాడు విరించి, ఆ తరు రూపంలో స్వయంగా విష్ణుమూర్తి వచ్చినట్లే అనిపించి రేణుకాదేవి పరశురామునితో - నాయనా! మరొక్కసారి ఈ కృష్ణామలకీ రూప విష్ణుమూర్తిలోకి ప్రవేశించు. శివ స్వరూపుడైన నీ తండ్రిని స్తుతించు. ఈ కృష్ణామలకం త్రిభువనేశ్వరుడు. సాక్షాద్విష్ణువు, నీ తండ్రి సదాశివుడు. కనుక తరువు అవుతుంది.


No comments:

Post a Comment