Wednesday 2 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (12)



ఒక అందమైన పెట్టి దొరికిందనుకుందాం. అందులో ఎన్నో రత్నాలున్నాయి. దానిని తెరవడానికి మనదగ్గర తాళం చెవులు లేదనుకుందాం. చెవులు లేవని పెట్టెను పారవేస్తామా? తీరా తాళం చెవులు దొరికిన తరువాత బాధపడమా? అట్లాగే ఆమె వ్రాసిన పాట అట్టిది. అందరూ తెలియకపోయినా భద్రపరుచుకోవాలి. అనగా కంఠస్థం చేయాలి. యోగ రహస్యాలున్న పాటలు అర్థం కాకపోయినా భక్తితో పాడితే ఆ స్వామియే ఏ నాటికో తెలియపరుస్తాడు.

అందరికీ ఇష్ఠుడు అన్నాను కదా, శివునికి సంబంధించిన ఈశ్వర లింగం, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, విష్ణ్వాలయంలో ఉండవు. కాని వినాయక ప్రతిమలు మాత్రం ఉంటాయి. ఆయన శివ కుటుంబానికి చెందిన వాడైనా! గమనించారా! అతన్ని తమిళంలో తుంబిక్కై ఆళ్వార్ అని అంటారు. కనుక అతని అందరూ ఆదరిస్తారని తేలింది కదా! 

అందువల్లనే జైన బౌద్ధ ఆలయాల్లోనూ అతణ్ణి కొలుస్తారు. ఈశ్వర లింగం తమిళనాడులో మాదిరిగా ఊరూర, వీథివీథినా మిగతా ప్రాంతాలలో ఎక్కువగా కనబడకపోయినా ఈ విశాల భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈయన మూర్తులుంటాయి. ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చి భక్త్యావేశంతో గణపయ్య కన్యాకుమారిలో ఉన్నాడు, హిమాలయాల్లో ఉన్నాడని అన్నాడు. 

మన దేశంలోనే కాదు, జపాన్, మెక్సికో, ఇంకా ఎన్నో దేశాలలో ప్రత్యక్షమౌతాడు. ప్రపంచంలో చాలా దేశాలు ఎక్కడో ఒకచోట సాక్షాత్కరిస్తూనే ఉంటాడు.


No comments:

Post a Comment