Saturday 12 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (22)



మహారాష్ట్రలో గాణపత్యం ప్రబలంగా ఉండడం వల్ల ఎనిమిది ప్రముఖ గణపతులకు ఎనిమిది దివ్య క్షేత్రాలు వెలిసాయి. వీరిని అష్టవినాయకలంటారు. ఇందు మాయూరేశ్వరుడని ఒక వినాయకుని పేరు. అతని క్షేత్రం మోరేగావ్ గా ప్రసిద్ధం. మయూర గ్రామమే అట్లా మార్పు చెందింది. ఆ నగరం చుట్టూ గణపతి పరివార దేవతలుంటారు.

మయూరం, తమిళంలో మొయిల్ గా ఉత్తర దేశ భాషలలో మోర్ గా మారింది. సుబ్రహ్మణ్యుని తలచినప్పుడు అతని వాహనం నెమలి గుర్తుకు వస్తుంది. పురాణాలు, తంత్ర గ్రంథాలబట్టి వినాయకునకు మూషికం వాహనమైనా ఇక్కడ మాత్రం గణపతికి నెమలియే వాహనం. అతడు మయూరేశ్వరునిగా ప్రసిద్ధి.

మహారాష్ట్రలోని మోరేగావ్ లోని, తమిళనాడులోని తిరువలంచుళి ప్లేత్ర పురాణాలను బట్టి స్వామికి చాలా మహిమ ఉన్నట్లు స్పష్టమౌతుంది. ఆ ప్రదేశానికే దక్షిణావర్తమైన పేరు. దక్షిణ అంటే కుడి; ఆవర్తం అంటే వంపు కదా. అట్లా స్వామి రాజధాని దక్షిణావర్తం.

No comments:

Post a Comment