Monday 7 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (17)




వ్రాతకు, వినాయకుని గల సంబంధం 

వెనుక ఇతని గుర్తును గురించి చెప్పుకున్నాం. పాత తాళపత్ర ప్రతులను చూస్తే మొట్టమొదట శ్రీ మహా గణాధిపతయే నమః అని ఉంటుంది. 

అయితే ఒక సందేహం. వాగ్దేవియైన సరస్వతిని ప్రార్థించకుండా ఈయనను ముందుగా స్తుతించడమేమిటి ? ఇక గణపతి యనే పదమే ఉంటుంది కాని, అతని పేర్లు వినాయక, విఘ్నేశ్వర, వక్రతుండ, హేరంబ అనే పదాలే లేవు. ఈ విషయమై విద్వాంసులతో చర్చించాను. గణమనే మాట, భాషకూ చెందుతుంది. వ్యాకరణ శాస్త్రంలో అన్ని అక్షరాలకు సంబంధించిన నియమాలుంటాయి. గణాధిపతి, అన్ని గణాలకు, అవి ఏ బాపతైనా అధిపతి. ఆయన పరమేశ్వరుని భూత గణాలకు అధిపతియే. అట్లాగే పదాలనే గణాలూ అతడు అధిపతియే. అందువల్లనే మిగిలిన పదాలను వాడకుండా గణాధిపతయే నమః అని గ్రంథం ప్రారంభానికి ముందుగా వ్రాస్తారు.

ప్రణవాకారంలో ఉంటాడు కదా! ప్రణవమే అన్ని నాదాలకూ మూలం కనుక, అన్ని పదాలకూ ఇతడధిపతి కనుక ఆ పదాన్నే వాడాలి.

No comments:

Post a Comment