Friday 18 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (28)


అయితే మాతామహునితో ఎందుకు మొదలైంది? పితామహుని పేర్కొనాలి కదా? మహస్తతః అపితామహం అని తరువాత ఉంది. అతడు జ్యోతి స్వరూపుడగుటచే అపితామహం =తండ్రి తరపున తాత లేని వాడయ్యాడు. అనగా శివునకు తండ్రి లేదు కదా! 

ఈ శ్లోకం తల్లి తండ్రియైన, గొప్ప పర్వతమైన హిమవంతుని గొప్పదనాన్ని పేర్కొని అట్టి వాని మనుమడు వినాయకుడిని, ఇతని తండ్రికి తండ్రి లేడని పేర్కొంది. ఇతని తండ్రి స్వయంభువు. అనగా తనంతట తాను తెలిసినవాడు.

ఇట్లా శ్లోక ప్రథమ పాదం ఉండగా రెండవ పాదంలో ఇతని గొప్పదనం వర్ణింపబడింది. అతడు నిజంగా తల్లిదండ్రులకు పుట్టినవాడని అనుకుంటారేమో. అతడే పరబ్రహ్మ స్వరూపుడని చెప్పింది. అనగా పుట్టుక లేని వాడయ్యాడు. కారణం జగతాం అనగా జగత్కారణుడు. అట్టివాడు శివశక్తి తనయునిగా ఆవిర్భవించాడు. వానికి నమస్కారం, కారణం 'జగతాం వందే'.

ఇట్లా జగత్కారణత్వం, పిల్లవానిగా కనబడుట ఉన్నా, మానవాకారం ధరించకుండా కంఠంపై నుండి గజాకారంతో, దాని దిగువనుండి మానవాకారంతో కన్పిస్తున్నాడు. 'కంఠాదుపరివారణం'.

No comments:

Post a Comment