Saturday 19 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (29)



ఇక మేనమామ గొప్పతనం :

మరొక శ్లోకం మేనమామ వల్ల కీర్తిని గడించాడు.

శ్రీకాంతో మాతులో యస్య, జననీ సర్వ మంగలా 

జనకః శంకరో దేవః, తం వందే కుంజరాననం

మొదటి శ్లోకం మాతా మహునితో ఆరంభమైంది. సాధారణంగా పితామహునితో అరంభం కావలసి యున్నా. దానికి సమాధానం ఉంది. తల్లిదండ్రులను పేర్కొనవలసి వచ్చినపుడు ముందు తల్లిని, తరువాత తండ్రిని పేర్కొనాలి. ముందు వేదమంత్రంలో మాతృదేవోభవ అని ఉంటుంది. తరువాత పితృదేవోభవ యని, అవ్వైయార్ కూడా మొదటి స్థానాన్ని తల్లికే ఇచ్చింది. ఇద్దరు తాతలను పేర్కొనవలసి వచ్చినపుడు తల్లి తండ్రిని పేర్కొనడం సబబు. 


కాని ఈ శ్లోకం తల్లిదండ్రుల కంటే ముందుగా మేనమామను పేర్కొంది.


లక్ష్మీ భర్తయైన మహావిష్ణువు మేనమామగా గలవాడు వినాయకుడు తేలింది. శ్లోకం, శ్రీతో మొదలు పెట్టడం సబబే కదా! శ్రీయనగా మహాలక్ష్మి జగత్తునకు శ్రీ మహావిష్ణువు, సిరిసంపదలిచ్చే మహాలక్ష్మి ఉండవలసిందే. ఇట్టి దంపతులతో మన వినాయకునకు బంధుత్వం గొప్పదే కదా.

No comments:

Post a Comment