Wednesday 30 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (40)

నేటి శస్త్రాల కంటే నాటి అస్త్రాలు అధిక శక్తి సంపన్నమైనవి. ఇదంతా మంత్ర శక్తి వల్లనే. వీటి గురించి పురాణాలలో చాలా విశేషాలున్నాయి బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైనవాటి గురించి చదివేటపుడు నేటి అణ్వాయుధాలు దిగదుడుపుగా కన్పిస్తాయి. ఇవి భ్రూణాన్ని కూడా పాడు చేస్తాయి. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రం ఉత్తర గర్భానికి చేటు తీసుకొని రాలేదా? కృష్ణుడే రక్షించాడు.


సైనికుల శక్తిని గుర్తించింది అమ్మవారు. అదృష్టవశాత్తు కుట్ర మాత్రం ఈమే సైన్యం చేయలేదు. ఆమె జ్ఞాన స్వరూపురాలు కదా. అంతా ఆమెకు తెలుసు. ఇదంతా ఆమె లీలయే. 


విశుక్రుడు విజృంభించడానికి విఘ్నేశ్వరుని మహత్త్వం ప్రకటింప బడడానికీ ఆమెయే కారకురాలు. 


శివశక్తులనుండి శక్తి, జ్ఞానాగ్ని కుండం నుండి బయల్వెడలింది. లలితాంబికగా అవతరించింది. అదే సందర్భంలో శివుడు కామేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడాడు, ఎందుకంటే యుద్ధానికి అవివాహితను పంపండం ఎందుకని? వీరిద్దరిని కామేశ్వర కామేశ్వరి దంపతులుగా కీర్తిస్తారు. కామేశ్వరి మన మఠంలోని కామాక్షి. కామకోటి పీఠం ఆమె నిలయం. 

No comments:

Post a Comment