Tuesday 8 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (18)



మరొక కారణం. ఆయనే గొప్ప రాతగాడు. ఏది ప్రపంచంలో పెద్ద పుస్తకమని అడిగితే చటుక్కున, మహాభారతం అంటారు. ఎవరైనా సాగదీస్తూ మాట్లాడితే నీ చేటభారతం నా దగ్గర వినిపించకు అని అంటాం. భారతం లక్ష శ్లోకాలతో ఉంటుంది, పంచమ వేదం అని అంటారు కూడా. మిగిలిన నాలుగు వేదాలు ఒకరు చెప్పగా ఒకరు పల్కుతూ ఉంటారు. కానీ భారతం లిఖిత ప్రతియే. వ్యాసుడు చెబుతూ ఉంటే, గణపతి మేరు శిఖరంపై కూర్చొని వ్రాసాడని కథ. (ఇట్లా స్వామివారు ప్రసంగిస్తూ ఉండగా ఒకాయన లేచి వ్రాతగాడని అంటే అసలు రచయిత కదా అని ప్రశ్నించాడు). అసలు రచయిత వ్యాసుడే. విని వ్రాసిన వ్రాయసగాడు మాత్రమే గణపతి. అనగా Copyist ఆంగ్లంలో Writer అనే పదానికి రెండర్థాలూ ఉన్నాయి. రచయిత వ్రాయసగాడని, అందువల్ల వ్రాసేవాడు గణపతియంటే తప్పులేదు.   


ఇతడసలు రచయిత కాకపోయినా వ్రాయసగానికీ గౌరవం ఇచ్చి కొలుస్తున్నాం. బాగా చదువుకొన్నవాళ్ళే వ్రాయసగాండ్రు కావాలనే నియమమూ లేదు. అందంగా వ్రాయడమే వృత్తిగా కలవారుండేవారు. వారిని Calligraphist అనేవారు. ఆనాటి విద్యార్థులు ఎంత చదివి వ్రాసేవారు కాదు. విని కంఠస్థం చేసేవారు. అట్టి వ్రాయసగాండ్రూ తమ నాయకుడు గణపతియని, ఆ గణపతియే మొదటి వ్రాయసగాడని మన్నించేవారు.


No comments:

Post a Comment