Monday 14 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (24)

ఈ గ్రామం ప్రత్యేకత ఇంకా ఉంది. శ్వేత వినాయకుని తుండం, కుడివైపునకు తిరిగినట్లుండగా కావేరీ నది కూడా ఇక్కడే కుడివైపుకి తిరిగి ప్రవహిస్తోంది.

ఈ కావేరికి, వినాయకుని దగ్గర సంబంధం ఉంది. సహ్య పర్వత కొదగులో అగస్త్యుడు కావేరీ జలాన్ని కమందులుపులో బంధించాడట. ఇక్కడి వినాయకుడు, కాకిగా మారి కమండులువును ఒరుగునట్లుగా చేసాడట. అందలి నీటిని జగత్కల్యాణం కోసం ప్రవహింప చేసాడట. అట్లా తమిళనాడుకి కావేరి జలాన్ని పంచిపెట్టిన మూర్తిని మనసార భజిద్దాం.

కావేరీ నది, కర్ణాటక దాటి తమిళనాడులో ప్రవహించింది. కుంభకోణానికి చేరి ఒక బిలంలో ఆంతర్ధానమైంది. హేరండర్ అనే ముని తనంతట తాను త్యాగం చేయగా ఆ బిలం నుండి కావేరి వచ్చి ఈ స్వామి క్షేత్రాన్ని కుడివైపుగా చుట్టి ప్రవహించింది. 

తల కావేరిలో నల్లగా కాకి రూపం ఎత్తిన వినాయకుడు ఇక్కడ తెల్లగా ఉంటాడు. ఇతణ్ణి ప్రణవ స్వరూప వక్రతుండుడని కీర్తిస్తారు. కావేరి కూడా కుడివైపు ప్రవహించడం విశేషాం. 

తుండం కుడివైపునున్న మూర్తినే ప్రణవ స్వరూపునిగా భావించడంతో బాటు ఎడమవైపు తిరిగియున్నా ప్రణవ రూపునిగానే భజిద్దాం.

No comments:

Post a Comment