Thursday 17 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (27)


వినాయకునికి సంబంధించిన ప్రవర చెప్పేటపుడు అతని మాతా మహునితో ఆరంభమైంది. సాధారణంగా ప్రవర, ముత్తాతతో మొదలౌతుంది. తర్పణం ఇచ్చినపుడు మాత్రమే మాతామహస్మరణ చేస్తాం. మాతామహుడు, తల్లి యొక్క తాత; తల్లి యొక్క ముత్తాతలను స్మరిస్తాం. వారికి తర్పణలిస్తాం. అయితే మన వినాయకునకు తాత లేడు. తండ్రి శివుడే ఉన్నాడు. శివుడు తండ్రి లేదు కదా! శివుడు స్వయంభువు. ఇక తల్లికీ కారణం లేదు. ఆమెయే అన్నిటికీ కారణమాయె. కాని కొన్ని సందర్భాలలో కొన్ని అవతారాలను ఎత్తవలసి వస్తుంది. అందువల్ల వినాయకుని మాతామహుని పేర్కొనవలసి వచ్చింది.

అందువల్ల మాతామహ మహాశైలం అంటే (అమ్మ వాళ్ళ నాన్న) హిమాలయమే, హిమవంతుడే.

అమ్మవారు అధికారిణి, అఖిలాండ జన్మని, ఆమె దాక్షాయణి అనగా దక్షుని కూతురు. పార్వతి హిమవంతుని కూతురు; మీనాక్షి - మలయధ్వజుని కూతురు; కాత్యాయని = కత్యాయనుని కూతురు అయింది. 

పరమేశ్వరుణ్ణి ఎప్పుడు పేర్కొన్నామో వెంటనే పార్వతిని కూడా పేర్కొన్నట్లే. ఆమె పార్వతి అవతారంలోనే హిమవంతుని కూతురై, తపస్సు చేసి కామారియైన శివుణ్ణి పెండ్లాడింది. అతణ్ణి గృహస్థును చేసింది. ఇట్లా పార్వతి యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ మాతామహ మహాశైలంతో ఆరంభించబడింది. 

No comments:

Post a Comment