Tuesday 15 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (25)




పెద్దింటి పిల్లవాడు

భాగ్యవంతుల పిల్లలను కొందరు లాలిస్తూ ఉంటారు. అట్టివారి పట్ల ప్రేమ చూపిస్తే ఆ పిల్లవాని భాగ్యవంతులైన తల్లిదండ్రులు తమ పనులను చేసి పెడతారనే ఆశతో దగ్గరకు తీసుకొంటారు. ఎవరి పిల్లలంటే వారికి ముద్దు. కాకిపిల్ల కాకికి ముద్దనే సామెత యుంది కదా. 

ప్రపంచంలో రకరకాల భాగ్యవంతులున్నారు. అందరిలోనూ భాగ్యవంతులెవరయ్యా అంటే వినాయకుని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే. 

అమ్మవారిని, అయ్యవారిని పూజించడం అంత సులభం కాదు. అనేక నియమాలున్నాయి. కాని వారి తనయుణ్ణి పూజిస్తే వారింకా సంతోషిస్తారు. ఇక మన స్వామిని సులభంగా చేరవచ్చు. చిన్న వస్తువులిచ్చినా పిల్లలు సంతోషిస్తారు. అట్లాగే వినాయకుడికి దూర్వలర్పించినా సంతోషిస్తాడు. ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినా సంతోషిస్తాడు. లేదా ఒక కొబ్బరి కాయను కొట్టినా చాలు, ఏ క్రియ కలాపం లేకపోయినా. 

No comments:

Post a Comment