Wednesday 16 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (26)


పిల్లవాని గొప్పదనాన్ని చెప్పినప్పుడు ఇతని తండ్రి, తాతలను ప్రస్తావిస్తాం. దానిని ప్రవర అని అంటారు. ప్రవరలో ముత్తాత పేరు కూడా రావాలి. కాని ఈ చెప్పబోవు శ్లోకం, తాతతోనే ముగుస్తుంది. 

శ్లో|| మాతా మహ మహశైలం మహస్తతోఽ పితామహం

 కారణం జగతాం వందే కంఠాదుపరివారణం

విష్ణు సహస్ర నామాలకు పూర్వభాగంలో వ్యాసుని ముత్తాతయైన వసిష్ఠుని దగ్గరనుండి మొదలై వ్యాసుని కొడుకైన శుకుని వరకూ ఉంటుంది. శుకుడు, బ్రహ్మచారి కనుక అతని సంతాన ప్రసక్తి ఉండదు. అక్కడినుండి శిష్యపరంపర మొదలౌతుంది. గౌడపాద - గోవింద భగవత్పాద - ఆది శంకరులని ఇట్లా గురువందనం ఉంటుంది.

విఘ్నేశ్వరుని గురించి చెబుతూ ఉండగా ఇట్టి గురుపరంపర గురించి చెప్పడమొక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విఘ్నేశ్వరుడు వ్యాసునితో సంబంధం ఉన్నవాడే. విఘ్నేశ్వరుని పెక్కు రూపాలలో వ్యాస గణపతి యొకటి. కనుక వ్యాసుని స్మరిస్తున్నాం. మనం ముందుగా గురువందనం చేయాలి కదా!

No comments:

Post a Comment